News June 11, 2024
డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ దరఖాస్తుల ఆహ్వానం

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(డీఐఈఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్ఈ) కోర్సుల్లో చేరేందుకు డీఈఈసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైందని ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యాశిక్షణ సంస్థ ప్రిన్సిపల్ సామినేని సత్యనారాయణ సోమవారం తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు జూన్ 30 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇంటర్లో 50 శాతం మార్కులు కలిగి ఉండాలని చెప్పారు.
Similar News
News May 8, 2025
ఖమ్మం: ఆసుపత్రి నర్స్.. అనుమానాస్పద మృతి

సత్తుపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న భూక్య కళ్యాణి(22) అనే యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది. పెనుబల్లి మండలం బ్రహ్మలకుంటకు చెందిన కళ్యాణి సత్తుపల్లిలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో నర్సుగా పనిచేస్తూ మసీదు రోడ్డులోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటుంది. రూమ్లో ఉరివేసుకుని మృతి చెందగా స్థానికులు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
News May 7, 2025
KMM: సెలవుల్లో పిల్లలు జర జాగ్రత్త..!

బడులకు వేసవి సెలవులు, పిల్లలకు ఆటవిడుపు మొదలయ్యాయి. పిల్లలకు ఆటలు, తమ మిత్రులతో సరదా కోసం ఈతకు బయటకి వెళ్తుంటారు.. పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. గత వారం రోజులుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో పిల్లలు ఆటవిడుపు కోసం బయటకి వెళ్లి వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, పిల్లలను బయటకు వెళ్లకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.
News May 7, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

1) ఖమ్మం: ‘విద్యా రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు’ 2) ఏన్కూర్: ‘ఎన్నికలొస్తే బీఆర్ఎస్దే విజయం’ 3) కూసుమంచి: ఖమ్మం-సూర్యాపేట హైవేపై ఆటో పల్టీ 4) మధిర: వర్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా 30న సభ 5) మధిర: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ 6) ఖమ్మం: తపాలా శాఖ రూ.10, రూ.15లక్షల బీమా 7) ధరణిని బంగాళాఖాతంలో కలిపాం: వైరా ఎమ్మెల్యే 8) ఖమ్మం: ఆరోగ్య రక్షణలో వైద్యులు కీలకం: కలెక్టర్.