News December 6, 2024
డిసెంబర్ నెలాఖరుకు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి: ప.గో కలెక్టర్

పేదల ఇళ్ల నిర్మాణాలపై జిల్లాలోని అన్ని మండలాల హౌసింగ్ డిఈలు, ఎఈలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పగో జిల్లా కలెక్టర్ నాగరాణి శుక్రవారం సమీక్షించారు. జిల్లాకు కేటాయించిన 3,159 నిర్మాణాల లక్ష్యంలో 1,737 మాత్రమే పూర్తి చేయడం జరిగిందని, ఇంకా పూర్తి చేయవలసిన 1,422 ఇళ్ల నిర్మాణాలను డిసెంబర్ నెలాఖరు నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
Similar News
News January 22, 2026
ప.గో: ‘అమరజీవి జలధార’కు రూ.1,400 కోట్లు

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రక్షిత నీరు అందించే ‘అమరజీవి జలధార’ పథకానికి రూ.1,400 కోట్లు మంజూరైనట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం పాలకొల్లులో ఆర్డబ్ల్యూఎస్, ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డెల్టా ప్రజల ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఈ పథకాన్ని రూపొందించామని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News January 22, 2026
ప.గో: ‘అమరజీవి జలధార’కు రూ.1,400 కోట్లు

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ రక్షిత నీరు అందించే ‘అమరజీవి జలధార’ పథకానికి రూ.1,400 కోట్లు మంజూరైనట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం పాలకొల్లులో ఆర్డబ్ల్యూఎస్, ఏజెన్సీ ప్రతినిధులతో ఆయన సమీక్ష నిర్వహించారు. డెల్టా ప్రజల ఆరోగ్య సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా ఈ పథకాన్ని రూపొందించామని, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News January 21, 2026
బాల్య వివాహాల నిర్మూలన అందరి బాధ్యత: జడ్జి సుధారాణి

బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి ఒక్కరిపై ఉందని భీమవరం సివిల్ జడ్జి సుధారాణి అన్నారు. బుధవారం ఉండి ఎంపీడీఓ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరిస్తూ, ఎక్కడైనా ఇలాంటివి జరిగితే తక్షణమే అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం ఈ సామాజిక రుగ్మత నిర్మూలనకు అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎన్.సుధీర్ పాల్గొన్నారు.


