News February 12, 2026
డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీ.. సిబ్బంది డుమ్మా

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గోపాల్ రావు ములుగు(మం) రాంచంద్రాపురం, పందికుంట ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాంచంద్రపురం సబ్ సెంటర్ లో సిబ్బంది ఎవ్వరూ విధుల్లో లేరు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన మెమోలు జారీ చేయాలని అధికారులకు సూచించారు. సమయపాలన పాటించకున్నా, ప్రజలకు అందుబాటులో లేకున్నా చర్యలు తప్పవన్నారు. తర్వాత పందికుంట అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు.
Similar News
News March 13, 2026
అక్షరాంధ్ర పరీక్షకు 100% హాజరు కావాలి: కలెక్టర్

ఈ నెల 15న నిర్వహించే అక్షరాంధ్ర ఫైనల్ పరీక్షకు 100 శాతం హాజరయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పల్నాడు కలెక్టర్ కృత్తికా శుక్లా సూచించారు. శుక్రవారం టీసీ ద్వారా సంబంధిత అధికారులతో పరీక్షా ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో అక్షరాంధ్ర కింద 1,27,627 మందిని గుర్తించామన్నారు. వీరందరూ అక్షరాస్యులుగా మారాలని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో 2,000 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు వివరించారు.
News March 13, 2026
ఎల్పీజీ పంపిణీపై ప్రత్యేక నిఘా ఉంచాలి: నిర్మల్ ఎస్పీ

జిల్లాలో ఎల్పీజీ పంపిణీ వ్యవస్థపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ వంటి చర్యలను కట్టడి చేయాలని ఎస్పీ జానకి షర్మిల పోలీసు అధికారులకు సూచించారు. ఎవరైనా అక్రమంగా ఎల్పీజీ సిలిండర్లను నిల్వ ఉంచడం లేదా అధిక ధరలకు విక్రయించడం వంటి కార్యకలాపాలు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు.
News March 13, 2026
వనపర్తి: పది పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: ఎస్పీ

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో వనపర్తి జిల్లాలోని 37 పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ కోసం BNSS-2023 సెక్షన్ 163 (గతంలోని 144 సెక్షన్) అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 7,212 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.


