News November 16, 2024
డీఎస్సీ కోచింగ్ సెంటర్ను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డీఎస్సీ కోచింగ్ సెంటర్ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి కోచింగ్ సెంటర్ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులు ఇబ్బంది లేకుండా ఉండాలని ఈ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
Similar News
News February 11, 2026
రైలు ద్వారా అరటి ఎగుమతికి సహకారం అందిస్తాం: కలెక్టర్

రైలు ద్వారా అరటి ఎగుమతిని చేపట్టేందుకు తగిన సహకారం అందిస్తామని ఎగుమతుదారులు, అరటి ఎగుమతి వీలైనంత త్వరగా ప్రారంభించాలని కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో రైల్వే ద్వారా తాడిపత్రి నుంచి జేఎస్పీటీ పోర్టుకు అరటి ఎగుమతులను ప్రారంభించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఉద్యాన శాఖ అధికారులు, అరటి ఎగుమతి దారులతో కలెక్టర్ సమీక్షించారు.
News February 11, 2026
నెలవారీ నేర సమీక్షా సమావేశం

అనంతపురం జిల్లా పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని ఎస్పీ జగదీశ్ బుధవారం నిర్వహించారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, హత్య కేసులు, POCSO, రేప్ కేసులు, 174 Cr.P.C కేసులు తదితర వాటి కేసులను పూర్తి చేయాలన్నారు. కేసుల ఛేదింపునకు, పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు, మెళకువలను అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
News February 11, 2026
అనంత: ‘నిహార ఆసుపత్రికి నోటీసులు పంపించండి’

తాడిపత్రిలోని నిహార ఆసుపత్రికి నోటీసులు పంపించాలని సంబంధిత అధికారులను DMHO దేవి ఆదేశించారు. అక్కడి వైద్య సిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా కాన్పు విషయంలో సిజేరియన్ అవసరమైన సందర్భంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన నిహార ఆసుపత్రికి నోటీసులు జారీ చేయాలన్నారు. పేషంట్ల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.


