News October 11, 2024

డీఎస్సీ-2024 కౌన్సిలింగ్‌కు ఆదేశాలు రాలేదు: డీఈఓ బిక్షపతి

image

డీఎస్సీ-2024 కౌన్సిలింగ్ విషయంపై ఇప్పటి వరకు ఉన్నతాధికారుల నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు అని డీఈఓ బిక్షపతి తెలిపారు. ప్రస్తుతం నియామక పత్రాలు అందుకున్న ఉపాధ్యాయులు తమ వద్ద రిపోర్టు చేస్తున్నారు. గురు, శుక్రవారాలు ఉపాధ్యాయుల రిపోర్టింగ్కు కు అవకాశం ఇచ్చాం అని అన్నారు. దసరాకు ముందు పోస్టింగ్ లు ఇచ్చే అవకాశం లేదు. కాబట్టి దసరా తర్వాతే కొత్త ఉపాధ్యాయులకు పోస్టింగ్‌లు ఇస్తాం అని పేర్కొన్నారు.

Similar News

News October 23, 2025

NLG: ఇక ఆ స్కూళ్లల్లో బాలికలకు కరాటే శిక్షణ!

image

బాలికల్లో ధైర్యసాహసాలు పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కరాటే శిక్షణను అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంశ్రీ యోజన స్కూళ్లలో ఈ ఏడాది NOV నుంచి అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు KGBV, కొన్ని ఎంపిక చేసిన పాఠశాలల్లో మాత్రమే ఈ కరాటే శిక్షణ అమలవుతుండగా తాజాగా జిల్లాలో 36 పీఎంశ్రీ పాఠశాలల్లోనూ అమలు చేయనున్నారు. బాలికలకు కరాటే జూడో, కుంగ్ ఫూ నేర్పిస్తారు.

News October 23, 2025

NLG: భర్తీకి నోచని పోస్టులు.. ఆ దరఖాస్తులు ఏమయ్యాయి?

image

నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పోస్టులు మంజూరైనా భర్తీకి నోచుకోవడం లేదు. ఈ కళాశాలలో రెగ్యులర్ పద్ధతిన వివిధ విభాగాల్లో 952 పోస్టులను భర్తీ చేయగా.. ఏడాది కిందట మరో 237 పోస్టులను అవుట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు స్వీకరించారు. ఏడాది దాటిన ఆ పోస్టుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News October 23, 2025

NLG: పర్వతరావు చెరువుకు రూ.1.22 కోట్లు మంజూరు

image

దేవరకొండ మండలంలోని పర్వతరావు చెరువు పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం రూ.1.22 కోట్లతో పరిపాలన అనుమతులను మంజూరు చేసింది. ఈ మేరకు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చెరువు పునరుద్ధరణకు నిధులు మంజూరు కావడం పట్ల ఆయకట్టు పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేశారు.