News July 11, 2024

డీజీపీ జితేందర్.. తొలుత నిర్మల్ ఏఎస్పీ

image

నిర్మల్ సహాయక ఎస్పీగా తొలి పోస్టింగ్ చేపట్టిన జితేందర్ రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. ఆయన ఇక్కడ ఏఎస్పీగా 6 జనవరి 1995 నుంచి 12 డిసెంబరు 1995 వరకు పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు.. నిర్మల్ ఏఎస్పీగా ఉన్న సమయంలో ఆయన వివాహం జరిగింది. ఏడాదిపాటు పనిచేసిన ఆయన శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతో కృషి చేసినట్లు ఆయనతో కలిసి విధులు నిర్వర్తించిన పోలీసులు వెల్లడించారు.

Similar News

News October 19, 2025

దీపావళి శాంతియుతంగా జరుపుకోండి: ADB కలెక్టర్

image

దీపావళి వెలుగుల పండుగగా ప్రతి ఇంటిలో ఆనందం, ఐకమత్యం, సంతోషం నిండాలని ఆకాంక్షించారు. గిరిజనుల సాంప్రదాయ పండుగ దండారి గుస్సాడి సందర్భంగా గిరిజన సోదరులు, కళాకారులకు కలెక్టర్ రాజర్షి షా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ పండుగలను శాంతి, ఐకమత్యం, సోదరభావంతో జరుపుకోవాలని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

News October 19, 2025

ADB: చివరి రెండు రోజులు పోటెత్తారు!

image

మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలకు పెంచడంతో జిల్లాలో ఈసారి 711 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంలో 1047 వచ్చినా, ఫీజు పెంపుతో ప్రభుత్వానికి రూ.21.33 కోట్ల ఆదాయం సమకూరింది. గతంతో పోలిస్తే రూ.39లక్షలు ఎక్కువ. ఉట్నూర్ ఎసైజ్ స్టేషన్ పరిధిలో 39వ షాపునకు అత్యధికంగా 25 దరఖాస్తులు వచ్చాయి. 9 షాపులకు రీ-టెండర్ అవకాశం ఉండగా, 3రోజుల క్రితం100లోపే దరఖాస్తులుండగా.. చివరి 2 రోజుల్లో భారీగా వచ్చాయి.

News October 19, 2025

‘పది’లో ఆదిలాబాద్ ప్రత్యేకంగా నిలిచేలా

image

​గతేడాది పదో తరగతిలో జిల్లా 97.95% ఉత్తీర్ణత సాధించి, రాష్ట్రంలో 9వ స్థానంలో నిలిచింది. ఈసారి కూడా అదే తరహాలో మరింత పకడ్బందీగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. జిల్లాలోని 130 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 6,354 మంది విద్యార్థులకు ఇప్పటికే అభ్యసన దీపికలు, పోషకాలతో కూడిన బ్రెడ్ అందిస్తున్నారు. రోజూ సాయంత్రం 4:15 నుంచి 5:15 వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి.