News July 11, 2024

డీజీపీ జితేందర్.. తొలుత నిర్మల్ ఏఎస్పీ

image

నిర్మల్ సహాయక ఎస్పీగా తొలి పోస్టింగ్ చేపట్టిన జితేందర్ రాష్ట్ర డీజీపీగా నియమితులయ్యారు. ఆయన ఇక్కడ ఏఎస్పీగా 6 జనవరి 1995 నుంచి 12 డిసెంబరు 1995 వరకు పనిచేశారు. ఆ తర్వాత బెల్లంపల్లి అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు.. నిర్మల్ ఏఎస్పీగా ఉన్న సమయంలో ఆయన వివాహం జరిగింది. ఏడాదిపాటు పనిచేసిన ఆయన శాంతిభద్రతల పరిరక్షణకు ఎంతో కృషి చేసినట్లు ఆయనతో కలిసి విధులు నిర్వర్తించిన పోలీసులు వెల్లడించారు.

Similar News

News November 18, 2025

ఆదిలాబాద్‌లో రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు

image

బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లు చేపట్టనున్నట్లు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ తలపెట్టిన బంద్‌ను విరమించుకున్న నేపథ్యంలో ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ, ప్రైవేటు ద్వారా పత్తి కొనుగోళ్లు యథావిధిగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని రైతు సోదరులు గమనించాలని సూచించారు.

News November 18, 2025

ADB: ఈ నెల 20న వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు

image

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో ఈ నెల 20న వేడుకలను నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మిల్కా పేర్కొన్నారు. ఈ వేడుకల్లో జిల్లాలోని వయోవృద్ధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. డీఎంహెచ్ఓ, రిమ్స్ వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో ఉదయం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News November 18, 2025

ADB: ఉపకార వేతనం మంజూరుకై దరఖాస్తుల ఆహ్వానం

image

2025–26 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10 తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులు ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి రాజలింగు తెలిపారు. అర్హులైన విద్యార్థులు http://telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా డిసెంబర్ 15 లోపు దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.