News September 11, 2024

డీజేలకు నో పర్మిషన్: మచిలీపట్నం డీఎస్పీ

image

వినాయక నిమజ్జన ఊరేగింపులో DJలకు అనుమతి లేదని మచిలీపట్నం డీఎస్పీ అబ్దుల్ సుభాన్ తెలిపారు. స్థానిక సిరి కళ్యాణ మండపంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమైన ఆయన.. నిమజ్జనం రోజు తీసుకోవల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. మద్యం తాగి నిమజ్జన ఊరేగింపుల్లో పాల్గొన్నా, ఎక్కడైనా అల్లర్లకు పాల్పడినా కమిటీ వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. అందరూ సహకరించి, పండగను ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలన్నారు.

Similar News

News December 19, 2025

DRC సమావేశాలను సీరియస్‌గా తీసుకోండి: బుద్ధప్రసాద్

image

ఎంతో ప్రాధాన్యత కలిగిన జిల్లా సమీక్షా మండలి సమావేశం (DRC) నిర్వహణను సీరియస్‌గా తీసుకోవాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను కోరారు. శుక్రవారం సాయంత్రం సుభాష్ అధ్యక్షతన DRC సమావేశం నిర్వహించారు. అయితే మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కావల్సిన సమావేశం 4 గంటలకు ప్రారంభం కావడం పట్ల బుద్ధప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

News December 19, 2025

పరిశ్రమలు నెలకొల్పేందుకు చర్యలు తీసుకోండి: కలెక్టర్

image

జిల్లాలో విరివిగా పరిశ్రమలు నెలకొల్పేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ DK బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పరిశ్రమలు, తదితర అంశాల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో APIIC ద్వారా గత 2ఏళ్లలోపు మల్లవల్లి, వీరపనేనిగూడెం పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని అనుమతులు పొంది ఇంకా యూనిట్లను ప్రారంభించని వారితో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

News December 19, 2025

పామాయిల్ సాగుపై రైతులను చైతన్య వంతులను చేయండి: కలెక్టర్

image

అధిక లాభాలు ఇచ్చే పామాయిల్ సాగుపై రైతుల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్ డీకే బాలాజీ ప్రజాప్రతినిథులను కోరారు. శుక్రవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో వ్యవసాయ శాఖపై జరిగిన చర్చలో ప్రత్యేకంగా పామాయిల్ సాగు వల్ల కలిగే లాభాలను కలెక్టర్ సమావేశానికి హాజరైన ప్రజా ప్రతినిథులకు వివరించారు. ప్రతి ఒక్క రైతు పామాయిల్ సాగుపై మరలేలా రైతులను ప్రోత్సహించాలన్నారు.