News March 8, 2025

డీజేలపై కొరడా ఝలిపిస్తున్న వరంగల్ కమిషనరేట్ పోలీసులు

image

వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో డీజేలపై ఉన్న నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో చదువుకునే విద్యార్థులకు డీజే శబ్దాల కారణంగా ఇబ్బంది పడటంతో పాటు వృద్ధులకు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో వరంగల్ కమిషనర్ పరిధిలో డీజేల వినియోగంపై పోలీసులు నిషేధాన్ని అమలు చేస్తూ ఇప్పటివరకు కమీషనరేట్ పరిధిలో 9 డీజేలను పోలీసులు సీజ్ చేశారు.

Similar News

News December 4, 2025

ఇలా చేస్తే.. హ్యాకర్లకి చిక్కరు!

image

రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. హిస్టరీ డిలీట్ చేయడం, ప్రైవేట్ ట్యాబ్ ఉపయోగించడం నిజమైన రక్షణ కాదని నిపుణులు అంటున్నారు. పూర్తిస్థాయి ప్రైవసీ కోసం జీరో-లాగ్ VPN వాడటం వల్ల బ్రౌజ్‌ చేసేటప్పుడు హిస్టరీ సేవ్ అవ్వదు. బ్రౌజింగ్‌కి వేర్వేరు డివైజ్‌లు ఉపయోగించడం వల్ల డేటా ట్రేస్ చేయడం కష్టం అవుతుంది. కుకీలను బ్లాక్ చేయాలి. ప్రతీ దానికి ఒకే మెయిల్ వాడకూడదు. పాస్‌వర్డ్‌లను మారుస్తూ ఉండాలి.

News December 4, 2025

160 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

భోపాల్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<>BHEL<<>>) 160 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ITI, డిప్లొమా, డిగ్రీ(BE, బీటెక్, BBA) అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. NATS పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://bpl.bhel.com/

News December 4, 2025

సంగారెడ్డి: భారీగా రేషన్ బియ్యం పట్టివేత

image

మెదక్ జిల్లా తూప్రాన్‌లో అక్రమంగా తరలిస్తున్న 285.70 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు విజిలెన్స్ డీఎస్పీ రమేష్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం నుంచి మహారాష్ట్రకు సన్న రేషన్ బియ్యము తరలిస్తున్నారు. నమ్మదగిన సమాచారం రావడంతో తూప్రాన్ పరిధి లోని అల్లాపూర్ టోల్ ప్లాజా వద్ద గురువారం వాహన తనిఖీ చేపట్టగా రేషన్ బియ్యం లారీ పట్టుబడినట్లు తెలిపారు. విజిలెన్స్ సీఐ అజయ్ బాబు పాల్గొన్నారు.