News February 8, 2025
డీవార్మింగ్ డేను విజయవంతం చేయాలి: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో ఈనెల 10వ తేదీన నిర్వహించే డీవార్మింగ్ డేను విజయవంతం చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం ఏర్పాటుపై అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏడాది నుంచి 19 ఏళ్ల పిల్లలకు ఆయా పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఆల్బెంజోల్ టాబ్లెట్స్ ఉచితంగా అందిస్తామన్నారు.
Similar News
News December 23, 2025
సంగారెడ్డి: అన్నదమ్ములను కలిపిన ఎన్నికలు

ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు అన్నదమ్ములను కలిపాయి. SRD జిల్లా కల్హేర్ మండలం మాసాన్పల్లికి చెందిన కుర్మా సాయిలు, సోదరుడు కుర్మా బాగయ్య కుటుంబాలు గొడవలు కారణంగా ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో సాయిలు సర్పంచిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సాయిలు, బాగయ్య కలిసి పనిచేయగా సాయిలు 12 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల్లో సోదరులిద్దరూ కలిసి పోవడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
News December 23, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.2,400 పెరిగి రూ.1,38,550కు చేరింది. రెండ్రోజుల్లోనే రూ.4,370 పెరగడం గమనార్హం. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,200 ఎగబాకి రూ.1,27,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.3,000 పెరిగి రూ.2,34,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 23, 2025
కడప జిల్లాలో వీకెండ్ ఎమ్మెల్యేలు?

కడప జిల్లాలో కూటమికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. వారానికి 2 రోజులు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. కింది స్థాయి నాయకులను పట్టించుకోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కడప MLA మాధవిరెడ్డిపై సొంతపార్టీ నేతలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇక మైదుకూరు MLA పుట్టా సుధాకర్ కూడా వీకెండ్ MLAగా నియోజకవర్గంలో పర్యటించండంతో ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది.


