News March 28, 2025
డీసీసీ ప్రెసిడెంట్ల సమావేశంలో పాల్గొన్న గద్వాల నాయకులు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తనదైన శైలిలో దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం ఢిల్లీలో జిల్లా అధ్యక్షుల ఎంపిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో గద్వాల జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Similar News
News December 2, 2025
నెల్లూరు జిల్లాకు ఏమైంది……?

ప్రశాంతమైన ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ఏమైంది. ఒకవైపు గూడూరు ప్రజలేమో నెల్లూరులో తమ నియోజకవర్గాన్ని కలపాలని నిరసనలు చేస్తూ ఆవేదన చెందుతున్నారు. మరోవైపు నెల్లూరులో లేడీ డాన్లు గంజాయి ముఠాతో హత్యలు చేయిస్తున్నారు. గతంలో ఇదే గడ్డ మీద ఎందరో మహానుభావులు హుందాగా రాజకీయాలు చేశారు. అలాంటి నెల్లూరు జిల్లా గడ్డ మీద నేడు ఈ పరిస్థితులు చూస్తున్నావారు నెల్లూరు జిల్లాకు ఏమైంది అంటూ ఆలోచనలో పడ్డారు.
News December 2, 2025
టెస్లా కార్లపై ఆసక్తి చూపని భారతీయులు!

భారతీయ మార్కెట్లో టెస్లా కార్లకు ఆశించిన స్థాయిలో స్పందన లభించట్లేదు. OCTలో 40, NOVలో 48 కార్లే అమ్ముడయ్యాయి. JULY నుంచి ఇప్పటి వరకు మొత్తం 157 కార్లనే విక్రయించింది. అధిక ధరలు, విపరీతమైన పోటీ కారణంగా ఇండియన్స్ ఆసక్తి చూపట్లేదని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే ఛార్జింగ్ స్టేషన్ల కొరత కూడా అమ్మకాలను ప్రభావితం చేస్తోందని చెబుతున్నారు. కాగా మోడల్ Y ధర రూ.60లక్షలకు పైగా ఉంది.
News December 2, 2025
ఆదిలాబాద్: రూ.30 పెరిగిన పత్తి ధర

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,060గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,940గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర రూ. 30 పెరిగినట్లు వెల్లడించారు.


