News March 28, 2025
డీసీసీ ప్రెసిడెంట్ల సమావేశంలో పాల్గొన్న గద్వాల నాయకులు

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షీ నటరాజన్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తనదైన శైలిలో దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం ఢిల్లీలో జిల్లా అధ్యక్షుల ఎంపిక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పాల్గొని మాట్లాడారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో గద్వాల జిల్లా ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
Similar News
News November 23, 2025
రేపు యథావిధిగా పీజీఆర్ఎస్: కలెక్టర్

భీమవరం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లా, మండల స్థాయి అధికారులు అందుబాటులో ఉండి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. కార్యాలయానికి రాలేని వారు 1100 కాల్ సెంటర్ ద్వారా లేదా meekosam.ap.gov.in వెబ్సైట్లో తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News November 23, 2025
OP సిందూర్పై పాక్ ఫేక్ న్యూస్.. తిప్పికొట్టిన ఫ్రెంచ్ నేవీ

ఆపరేషన్ సిందూర్పై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న పాకిస్థానీ మీడియాపై ఫ్రెంచ్ నేవీ విమర్శలు గుప్పించింది. మేలో జరిగిన ఘర్షణల్లో భారత రఫేల్ జెట్లను కూల్చి పాక్ వాయుసేన ఆధిపత్యం చెలాయించిందంటూ ఓ ఫ్రెంచ్ ఆఫీసర్ చెప్పినట్లుగా అక్కడి మీడియా రాసుకొచ్చింది. అది అసత్యాలతో కూడిన కల్పిత కథనమని ఫ్రెంచ్ నేవీ పేర్కొంది. ఆ ఆఫీసర్ పేరు కూడా తప్పేనని, అతను ఎలాంటి ప్రకటనా చేయలేదని స్పష్టం చేసింది.
News November 23, 2025
ములుగు: మహిళా సంఘాలకు మంత్రి శుభవార్త

ములుగు జిల్లా మహిళా సంఘాలకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. రానున్న మేడారం జాతర సమయంలో వేలాది మంది భక్తులు జాతరకు వస్తారని, ఈ సందర్భంగా జాతీయ రహదారికి ఇరువైపులా ఫుడ్ కోర్ట్స్, దుకాణాలు, వ్యాపారాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా అనుమతి ఇచ్చిందన్నారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సీతక్క కోరారు.


