News March 1, 2025

డుంబ్రిగూడలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

డుంబ్రిగూడ మండలం నారింజవలస సమీపంలో శుక్రవారం రోడ్డు <<15611939>>ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. విశాఖకు చెందిన రామ్మోహన్, సోమనాథ్ పాడేరు నుంచి అరకులోయ వైపు వస్తుండగా స్కూటీ డివైడర్‌ని ఢీకొట్టింది. ఈఘటనలో సోమనాథ్ మరణించగా రామ్మోహన్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో అరకు ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Similar News

News February 25, 2026

కామారెడ్డి: తొలిరోజు ఇంటర్ పరీక్షలకు 96.48 శాతం హాజరు

image

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. ప్రథమ సంవత్సర పరీక్షకు జిల్లావ్యాప్తంగా 9,565 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా వారిలో 9,228 మంది పరీక్షకు హాజరైనట్లు ఇంటర్ నోడల్ ఆఫీసర్ షేక్ సలాం తెలిపారు. 96.48 శాతం హాజరు నమోదైందన్నారు. 337 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాలేదని ఆయన వెల్లడించారు.

News February 25, 2026

డయిల్‌ 100కు తక్షణమే స్పందించాలి: భద్రాద్రి ఎస్పీ

image

=బాధితుల నుంచి ‘డయిల్‌ 100’కు ఫోన్‌ రాగానే పోలీసులు తక్షణమే స్పందించి వారికి అండగా నిలవాలని ఎస్పీ రోహిత్‌ రాజు ఆదేశించారు. బుధవారం పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రతి కేసులోనూ ‘క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌’ ద్వారా నేరస్థులకు శిక్ష పడేలా చూడాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు.

News February 25, 2026

అల్లాదుర్గం: బైక్ అదుపుతప్పి వ్యక్తికి గాయాలు

image

అల్లాదుర్గంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ముప్పారం గ్రామానికి చెందిన సనుబాల వీరేశం(41) పని నిమిత్తం అల్లాదుర్గం వచ్చి, తిరిగి తన బైక్‌పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.