News April 8, 2025
డుంబ్రిగూడ: డిప్యూటీ సీఎంకు ఉపాధి సిబ్బంది వినతి

డుంబ్రిగూడ మండలం కురిడి గ్రామంలో మంగళవారం పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అల్లూరి జిల్లా ఉపాధి సిబ్బంది తమ బాధలను ఏకరువు పెట్టారు. చాలీచాలని జీతాలతో గత 20ఏళ్ళు పైబడి పని చేస్తున్నామని, పెరిగిన నిత్యావసరాల ధరలతో కుటుంబాలను పోషించుకోవడం చాలా ఇబ్బందిగా మొర పెట్టుకున్నారు. పదోన్నతులు కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఇతర అలవెన్సులు మంజూరు చేయాలని కోరారు.
Similar News
News January 10, 2026
IIMCలో 51పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (<
News January 10, 2026
గండికోట ఉత్సవాలు.. హెలికాఫ్టర్ రైడ్ ధర తగ్గింపు

గండికోట ఉత్సవాలలో హెలికాఫ్టర్ రైడింగ్లో ధరల తగ్గించినట్లు కలెక్టర్ తెలిపారు. ముందుగా ఒక వ్యక్తికి రూ. 5 వేలుగా నిర్ణయించగా.. దానిని రూ.3 వేలకు తగ్గిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. 6 నిమిషాలు రైడింగ్ ఉంటుందన్నారు. గండికోట చుట్టు పక్క ప్రాంతాలు, గండికోట ప్రాజెక్టు, మైలవరం జలాశయాన్ని హెలికాఫ్టర్ ద్వారా వీక్షించే అవకాశం ఉంటుందన్నారు.
News January 10, 2026
టికెట్ ధరల పెంపు మీకు ఓకేనా?

సినిమా టికెట్ ధరల వ్యవహారం ఇప్పుడు ఒక అంతుచిక్కని ప్రశ్న. ఒకవైపు ‘భారీ బడ్జెట్ సినిమాలకు పెంపు తప్పదు’ అని మేకర్స్ అంటుంటే, ‘సామాన్యుడు వినోదానికి దూరం కావాలా?’ అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి సినిమా బాగుంటే ఎంతైనా ఖర్చు పెడతాం అనుకునే వారు కొందరైతే, కుటుంబంతో కలిసి చూడాలంటే ఈ ధరలు భారమేనని మెజారిటీ జనం అభిప్రాయపడుతున్నారు. ఓ సామాన్యుడిగా టికెట్ ధరల పెంపుపై మీ అభిప్రాయం ఏంటి? COMMENT


