News April 10, 2025

డైట్‌లో లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు ప్రభుత్వ డైట్ కళాశాలలో డిప్యుటేషన్(యఫ్.యస్.టి.సి)పై లెక్చరర్స్‌గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. డైట్‌లో 27 సాధారణ అధ్యాపకులు, ఉర్దూ 22 , ఉపన్యాసకులు 5 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. ఈ పోస్టులకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వారు అర్హులని తెలిపారు.

Similar News

News December 2, 2025

నెల్లూరు: దుబాయ్‌లో ఉద్యోగ అవకాశాలు

image

దుబాయ్‌లో హోమ్ కేర్ నర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి షేక్ అబ్దుల్ కయ్యం ఒక ప్రకటనలో తెలిపారు. 40 సంవత్సరాల లోపు ఉండి BSc నర్సింగ్ పూర్తి చేసి రెండేళ్ల అనుభవం కలిగి ఉండాలన్నారు. ఈ ఉద్యోగ అవకాశం రెండేళ్లు కాంటాక్ట్ ప్రాతిపదికన ఉంటుందన్నారు. ఈనెల 7వ తేదీలోగా కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.

News December 2, 2025

నెల్లూరు ‘నేర‘జాణలు వీళ్లు.!

image

నెల్లూరులో ‘నేర‘జాణల హవా ఎక్కువైంది. మొన్నటి వరకు నిడిగుంట అరుణ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేసింది. తాజాగా పెంచలయ్య హత్యతో అరవ కామాక్షి వెలుగులోకి వచ్చింది. కొందరు యువకులతో గ్యాంగ్ నడిపిస్తూ గంజాయి వ్యాపారం చేస్తోంది. తనకు అడ్డు వచ్చి వారిని ఇదే గ్యాంగ్‌తో బెదిరిస్తోంది. ఈక్రమంలోనే పెంచలయ్యను కామాక్షి హత్య చేయించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి లేడీ డాన్‌లను కఠినంగా శిక్షించాలని పలువురు కోరుతున్నారు.

News December 2, 2025

నేడు నెల్లూరు జిల్లా బంద్

image

వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇవాళ నెల్లూరు జిల్లా బంద్ జరగనుంది. పెంచలయ్య దారుణ హత్యకు నిరసనగా ఈ బంద్ నిర్వహిస్తున్నామన్నారు. గంజాయి, మత్తు పదార్థాలను నిషేధించాలని, గంజాయి మాఫియా నుంచి ప్రజలను కాపాడాలని, పెంచలయ్య హత్యకు కారకులైన వారిని శిక్షించాలని జరుగుతున్న బంద్‌కి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిన్న నిందితురాలు కామాక్షికి చెందిన ఇళ్లను స్థానికులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.