News November 21, 2024
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై రావికమతంలో కేసు నమోదు

సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మపై అనకాపల్లి జిల్లా రావికమతం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని SI ఎం.రఘువర్మ గురువారం తెలిపారు. 2024 మే 2న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారని గుడ్డిప గ్రామానికి చెందిన గల్లా నాని బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వర్మకు నోటీసులు స్వయంగా అందజేశామన్నారు.
Similar News
News November 17, 2025
బంగ్లా చెరలో ఉన్న మత్స్యకారులు.. దీనగాథ

భోగాపురం మండలం కొండరాజుపాలెం సర్పంచ్ సూరాడ చిన్నా ఆధ్వర్యంలో మత్స్యకారులు విశాఖ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. సముద్రంలో వేటకు వెళ్లగా బంగ్లాదేశ్ బోర్డర్లో ప్రవేశించడంతో 9 మందిని గతనెల 22న బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అరెస్టు చేసింది. అరెస్టు కాబడిన వారిలో సూరాడ అప్పలకొండ భార్య ఎనిమిది నెలల నిండు గర్భిణీగా ఉందని వెంటనే విడిపించేందుకు చొరవ చూపాలని కలెక్టర్కు మత్స్యకారులు కోరారు.
News November 17, 2025
బంగ్లా చెరలో ఉన్న మత్స్యకారులు.. దీనగాథ

భోగాపురం మండలం కొండరాజుపాలెం సర్పంచ్ సూరాడ చిన్నా ఆధ్వర్యంలో మత్స్యకారులు విశాఖ కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. సముద్రంలో వేటకు వెళ్లగా బంగ్లాదేశ్ బోర్డర్లో ప్రవేశించడంతో 9 మందిని గతనెల 22న బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ అరెస్టు చేసింది. అరెస్టు కాబడిన వారిలో సూరాడ అప్పలకొండ భార్య ఎనిమిది నెలల నిండు గర్భిణీగా ఉందని వెంటనే విడిపించేందుకు చొరవ చూపాలని కలెక్టర్కు మత్స్యకారులు కోరారు.
News November 16, 2025
వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు: ప్రణవ్

సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కావటంతో వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. ఫ్యూచర్ రెడీ ఇన్నోవేషన్ రాష్ట్రంగా ఏపీని సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. పెద్దఎత్తున ఒప్పందాలు జరగటంతో వైసీపీ నేతలు భయపడి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కోడిగుడ్డు మంత్రిగా పేరొందిన అమర్ నాథ్ ఉన్న ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు.


