News February 13, 2025
డోన్లో అద్భుత దృశ్యం

డోన్ పట్టణానికి సమీపంలో నూతనంగా నిర్మించిన షిర్డీ సాయిబాబా ఆలయంపై మాఘ పౌర్ణమి వేళ చంద్రుడు వెలిగిపోతూ దర్శనమిచ్చారు. నేడు సాయిబాబా ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ క్రమంలో మాఘ పౌర్ణమి వేళ చంద్రుడు ఆలయానికి వెలుగును ప్రసాదిస్తున్నట్లుగా అరుదైన దృశ్యం కనిపించింది. స్థానికులు ఆసక్తిగా తిలకించి తన ఫోన్లలో బంధించారు.
Similar News
News December 9, 2025
మీకు ఈ అలవాట్లు ఉన్నాయా?

కొన్ని అలవాట్లు అశుభకరమని పండితులు చెబుతున్నారు. ‘మాటిమాటికి ప్రతిజ్ఞలు చేయడం, ఒట్లు వేయడం దోషం. నిలబడి, తిరుగుతూ అన్నం తింటే దరిద్రులవుతారు. నోట్లో వేళ్లు పెట్టుకోవడం, గోళ్లు కొరుక్కోవడం అశుభానికి సంకేతం. నదిలో ఉమ్మడం దైవ దూషణతో సమానం. కంచంను ఒడిలో పెట్టుకొని, పడుకొని తినకూడదు. కంచంలో చేయి కడగడం కూడా మంచిది కాదు. ఈ అలవాట్లు వీడితే శుభాలు కలిగి, మీ జీవితం సంతోషంగా ఉంటుంది’ అని సూచిస్తున్నారు.
News December 9, 2025
ఇళ్ల స్థలాల దరఖాస్తుల్లో పెండింగ్ ఉండరాదు: JC

ఇంటి నివేశన స్థలాల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలన చేసి అర్హులైన లబ్దిదారుల వివరాలను పెండింగ్లో లేకుండా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. ఒంగోలులోని కలెక్టరేట్లో సోమవారం జేసీ మాట్లాడుతూ.. ఇంటి పట్టాల రీ- వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. అలాగే ఇంటి పట్టాల రీ-వెరిఫికేషన్పై MROలు ప్రత్యేక దృష్టి సారించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.
News December 9, 2025
BSWD: “మా కుటుంబ ఓట్లు అమ్మబడవు”

బాన్సువాడ నియోజకవర్గం, మోస్రా మండలం గోవూర్లో ఎన్నికల నేపథ్యంలో నవీన్ రెడ్డి వినూత్న రీతిలో ప్లెక్సీ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. సర్పంచ్, వార్డు సభ్యులకు పోటీ చేసే అభ్యర్థులను ఉద్దేశించి, “మా కుటుంబ ఓట్లు అమ్మబడవు” అని ఇంటి వద్ద ప్లెక్సీని ఏర్పాటు చేశారు. ఓటుకు నోటు తీసుకోకుండా, స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.


