News February 13, 2025
డోన్లో అద్భుత దృశ్యం

డోన్ పట్టణానికి సమీపంలో నూతనంగా నిర్మించిన షిర్డీ సాయిబాబా ఆలయంపై మాఘ పౌర్ణమి వేళ చంద్రుడు వెలిగిపోతూ దర్శనమిచ్చారు. నేడు సాయిబాబా ఆలయ ప్రతిష్ఠ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ క్రమంలో మాఘ పౌర్ణమి వేళ చంద్రుడు ఆలయానికి వెలుగును ప్రసాదిస్తున్నట్లుగా అరుదైన దృశ్యం కనిపించింది. స్థానికులు ఆసక్తిగా తిలకించి తన ఫోన్లలో బంధించారు.
Similar News
News October 29, 2025
కర్నూలు: ‘ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు’

ఇంటరాక్షన్ పేరుతో ర్యాగింగ్ చేసినా ఉపేక్షించమని మంగళవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. కేఎంసీలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సమావేశంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు సమాజానికి సేవ చేసే గొప్ప బాధ్యత కలవారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ, సూపరిండెంట్ వెంకటేశ్వర్లు, సాయి సుధీర్, రేణుక దేవి, సీఐ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
News October 29, 2025
తిరుపతి: ఇవాళ స్కూళ్లకు సెలవు లేదు

తిరుపతి కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుపతి జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు ఇవాళ నుంచి యథావిధిగా పనిచేయాలని DEO కేవీఎన్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడారు. DYEOలు, MEOలు, HMలు కలెక్టర్ ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేసి, అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈ సమాచారం తెలియజేయాలని పేర్కొన్నారు. పాఠశాలలు ఇవాళ నుంచే సాధారణంగా పనిచేసేటట్లు చూడాలని అన్నారు.
News October 29, 2025
త్వరలో మదనపల్లి జిల్లా సాకారం?

ఉమ్మడి చిత్తూరు జిల్లా మూడు జిల్లాలుగా మారింది. నాడు మదనపల్లిని అన్నమయ్య జిల్లాలో కలపడం కంటే జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్ బలంగా వినిపించింది. దీనికి అనుకూలంగా మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై సీఎం చర్చించారు. త్వరలో దీనిపై ఆమోదం తెలిపి మదనపల్లి జిల్లా కేంద్రం అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు పుంగనూరు లేదా పీలేరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. జిల్లా కేంద్రం మదనపల్లిపై మీ కామెంట్.


