News April 16, 2025
డోన్ మండలంలో బాలికపై అత్యాచారం!

బాలికపై అత్యాచారం జరిగిన ఘటన డోన్ మండలంలో జరిగింది. తొమ్మిదేళ్ల బాలిక ఇంటి వద్ద ఆడుకుంటుండగా బంధువైన విష్ణువర్ధన్ కొత్త దుస్తులు కొనిస్తానని ఇంటికి తీసుకెళ్లాడు. లైంగిక దాడికి పాల్పడి తర్వాత ఇంటి వద్ద వదిలిపెట్టాడు. బాలిక నీరసంగా ఉండటంతో తల్లి ప్రశ్నించగా జరిగిన విషయాన్ని కుమార్తె వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని ఎస్సై శరత్ తెలిపారు.
Similar News
News October 24, 2025
ఏడుపాయల క్షేత్రంలో వైభవంగా ఆకాశ దీపోత్సవం

కార్తీక మాసం పురస్కరించుకుని మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయం వద్ద శుక్రవారం ప్రదోషకాల పూజ అనంతరం ఆకాశ దీపోత్సవం, సామూహిక దీపారాధన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా ఉదయం, సాయంకాల వేళల్లో వన దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నామని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ దీపోత్సవ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
News October 24, 2025
విశాఖ: రోజ్గార్ మేళాలో యువతకు నియామక పత్రాల అందజేత

ఉడా చిల్డ్రన్ ఏరియాలో శుక్రవారం రోజ్గార్ మేళా నిర్వహించారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, నార్త్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాస్ పాల్గొని నూతనంగా ఉద్యోగాలు సాధించిన 100 మంది యువతకు ప్రభుత్వ శాఖలలో నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో 51వేల మందికి పైగా యువతకు నియామక పత్రాలు ఈరోజు అందజేసినట్లు తెలిపారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.
News October 24, 2025
న్యూస్ అప్డేట్స్

➤ J&Kలో రాజ్యసభ ఎన్నికల ఫలితాలు రిలీజ్. 3 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్, క్రాస్ ఓటింగ్తో ఒక స్థానంలో BJP గెలుపు
➤ బిహార్లో BJP-JDU కూటమి CM అభ్యర్థి నితీశ్ కుమార్ అని స్పష్టం చేసిన PM మోదీ.
➤ AP: తిరుపతిలోని స్వర్ణముఖి నదిలో నలుగురు యువకులు గల్లంతు. ఒకరి మృతదేహం లభ్యం.
➤ TG: జూబ్లీహిల్స్ తుది ఓటర్ లిస్ట్ రిలీజ్. మొత్తం 4,01,365 మంది ఓటర్లు.