News June 12, 2024

డోర్నకల్‌లో ‘MLA గారి తాలూకా’ ట్రెండ్

image

ఏపీలోని పిఠాపురం సంస్కృతి తెలంగాణకు చేరింది. ఇటీవల KNR జిల్లా చొప్పదండి, WGL పాలకుర్తి MLAల అభిమానులు వాహనాల మీద ‘ఎమ్మెల్యేల గారి తాలూకా’ అనే స్టిక్కర్లు అతికించి సందడి చేసిన విషయం తెలిసిందే. దీన్ని అనుసరిస్తూ డోర్నకల్‌లో సైతం వాహనాల మీద ఈ తరహా స్టిక్కర్లు కనిపిస్తున్నాయి. మంగళవారం డోర్నకల్ మండలంలో ఓ వాహనంపై ‘డోర్నకల్ MLA గారి తాలూకా’ అని రాసి ఉన్న స్టిక్కరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

Similar News

News March 27, 2025

WGL: ఈ వారంలో అధిక ధర పలికిన పత్తి

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు ఈరోజు అన్నదాతలకు మళ్ళీ ఊరటనిచ్చాయి. ఈ వారం మొదటి నుంచి పోలిస్తే ఈరోజు పత్తి ధర అధికంగా పలికింది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,030, మంగళవారం రూ.7,045, బుధవారం రూ.7,010 పలికిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ధర రూ.7050 కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్లో కొనుగోలు ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

News March 27, 2025

సంగెం: బైకును ఢీ కొట్టిన లారీ.. బాలుడు మృతి

image

వరంగల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గవిచర్లకి చెందిన గాలి చందు (17) బైక్‌పై ఆశాలపెళ్లి వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కంటైనర్ లారీ ఢీకొట్టడంతో చందు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 27, 2025

WGL: CONGRESS VS BRS.. రంగంలోకి మీనాక్షి!

image

TG కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం WGL, HNK, MLG, JN, BHPL, MHBD డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై చర్చించారు. కాంగ్రెస్ పై BRSచేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని చెప్పినట్లు సమాచారం. కాగా నేడు డీసీసీలతో ఢిల్లీలో అధిష్ఠానం సమావేశం కానుంది.

error: Content is protected !!