News February 20, 2025

డోర్నకల్: అనారోగ్యంతో చిన్నారి మృతి

image

అనారోగ్యంతో చిన్నారి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన బాలిక ప్రజ్ఞాశాలిని(8) వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో కుటుంబీకులు చిన్నారిని HYDలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు వారు తెలిపారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

Similar News

News October 21, 2025

VJA: CRDAలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

image

APCRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఫైనాన్షియల్, సోషల్ డెవలప్మెంట్ కన్సల్టెంట్ల పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేస్తున్నట్లు కమిషనర్ కన్నబాబు తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 23లోపు https://crda.ap.gov.in/లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలన్నారు. విద్యార్హతలు, దరఖాస్తు విధానం తదితర వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్ చూడాలన్నారు.

News October 21, 2025

నరసరావుపేట: ‘DA జీవోను సవరించాలి’

image

DA జీవోను వెంటనే సవరించాలని AISTF సంఘం జాతీయ కార్యదర్శి జోసెఫ్ డిమాండ్ చేశారు. సోమవారం జరిగిన సమావేశంలో నాయకులు పెదబాబు, సుబ్బారెడ్డి మాట్లాడారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన DA బకాయిలను 2027-28 సంవత్సరం నుంచి 12 దఫాలలో చెల్లిస్తామని కూటమి ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. ఇది ఉద్యోగులు, పెన్షనర్ల హక్కులను హరించడమేనని విమర్శించారు. దీపావళి కానుక అని చెప్పి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

News October 21, 2025

పాలమూరు: వీరులకు వందనం.. మిమ్మల్ని మరవం!

image

శాంతిభద్రతల పరిరక్షణలో అమరులైన SP జి.పరదేశి నాయుడు బృందం త్యాగం చిరస్మరణీయం. 1993లో సోమశిల వద్ద PWG ఘటనా స్థలాన్ని పరిశీలించి తిరిగి వస్తున్న బస్సును సుద్దగట్టు వద్ద పేల్చివేసిన నక్సల్స్‌, మొత్తం 10 మందిని పొట్టనబెట్టుకున్నారు. SPతో పాటు 2SIలు, 2HCలు, 5PCలు, డ్రైవర్ షాలి పాషా అమరులయ్యారు. వారి వీరత్వానికి, చూపిన తెగువకు జిల్లా శిరస్సు వంచి నమస్కరిస్తోంది.
#నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం