News February 20, 2025
డోర్నకల్: అనారోగ్యంతో చిన్నారి మృతి

అనారోగ్యంతో చిన్నారి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన బాలిక ప్రజ్ఞాశాలిని(8) వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో కుటుంబీకులు చిన్నారిని HYDలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు వారు తెలిపారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Similar News
News November 18, 2025
కుమార్తె రాజకీయ భవిష్యత్తుకోసమే కాంగ్రెస్లోకి కడియం!

ఎమ్మెల్యే శ్రీహరి కాంగ్రెస్లో చేరిక వెనుక కుమార్తె కావ్య రాజకీయ ప్రవేశమే ప్రధాన కారణంగా రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. WGL ఎంపీ స్థానానికి కావ్యకు BRS నుంచి అవకాశం వచ్చినప్పటికీ కాదని కడియం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో కావ్యను WGL ఎంపీగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ పరిణామాల మధ్య BRS ఫిరాయింపు ఫిర్యాదుతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో రాజకీయ వేడి నెలకొంది.
News November 18, 2025
కుమార్తె రాజకీయ భవిష్యత్తుకోసమే కాంగ్రెస్లోకి కడియం!

ఎమ్మెల్యే శ్రీహరి కాంగ్రెస్లో చేరిక వెనుక కుమార్తె కావ్య రాజకీయ ప్రవేశమే ప్రధాన కారణంగా రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. WGL ఎంపీ స్థానానికి కావ్యకు BRS నుంచి అవకాశం వచ్చినప్పటికీ కాదని కడియం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల్లో కావ్యను WGL ఎంపీగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ పరిణామాల మధ్య BRS ఫిరాయింపు ఫిర్యాదుతో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో రాజకీయ వేడి నెలకొంది.
News November 18, 2025
వేడెక్కిన కడియం శ్రీహరి రాజీనామా టాక్..!

ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ఘన్పూర్ MLA కడియం శ్రీహరి రాజకీయాల్లో తన క్లీన్ ఇమేజ్ కాపాడుకోవాలనే నిశ్చయంతో ఉన్నారనే టాక్ నడుస్తోంది. స్పీకర్ ఇచ్చిన నోటీసులకు స్పందించకపోవడం, అధిష్టానం సూచిస్తే రాజీనామా చేసి ఉపఎన్నికకు వెళ్లేందుకు సిద్ధమని ఆయన సంకేతాలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఫిరాయింపు అపవాదుతో కొనసాగే బదులు నేరుగా ప్రజాతీర్పు కోరాలని భావిస్తున్నట్లు సమాచారం.


