News February 20, 2025
డోర్నకల్: అనారోగ్యంతో చిన్నారి మృతి

అనారోగ్యంతో చిన్నారి మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామానికి చెందిన బాలిక ప్రజ్ఞాశాలిని(8) వారం రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో కుటుంబీకులు చిన్నారిని HYDలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందినట్లు వారు తెలిపారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
Similar News
News December 13, 2025
బేబీ పౌడర్తో క్యాన్సర్.. J&Jకు రూ.360 కోట్ల షాక్!

బేబీ పౌడర్ కేసులో జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జాన్సన్ కంపెనీ పౌడర్ వాడటం వల్ల అండాశయ క్యాన్సర్ వచ్చిందని ఆరోపించిన ఇద్దరు మహిళలకు $40M(రూ.360 కోట్లు) చెల్లించాలంటూ కాలిఫోర్నియా జ్యూరీ ఆదేశించింది. నాలుగు దశాబ్దాలుగా పౌడర్ వాడటంతో క్యాన్సర్ వచ్చి కీమోథెరపీ చేయించుకోవాల్సి వచ్చిందని బాధితులు తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీపై 67 వేలకుపైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి.
News December 13, 2025
భూపాలపల్లి: భార్యను చంపి భర్త ఆత్మహత్య

జిల్లాలో దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. గణపురం మండలం సీతారాంపురంలో బాలాజి రామాచారి తన భార్య సంధ్య (42)ను ఉరివేసి హత్య చేశాడు. అనంతరం తాను ఉరి వేసుకొని మృతి చెందాడు. మొదటి భార్య మరణించాక సంధ్యను వివాహం చేసుకున్నాడు. కూతురు, భార్య వేధింపులు తాళలేక ఈ దారుణానికి పాల్పడినట్లు వీడియో తీసి స్టేటస్ పెట్టాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 13, 2025
కుటుంబంలో ఎవరైనా మరణిస్తే తెలుపు దుస్తులు ఎందుకు?

కుటుంబంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల సమయంలో తెలుపు దుస్తులు ధరిస్తారు. అయితే ఈ రంగు శాంతి, స్వచ్ఛత, జ్ఞానం, ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తుంది. దుఃఖ సమయంలో తెల్ల దుస్తులు ధరిస్తే.. కుటుంబ సభ్యుల మనస్సుకు ప్రశాంతత లభిస్తుందట. అలాగే తెలుపు సత్యం, సద్భావనలకు చిహ్నం. మరణించిన ఆత్మ కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది కాబట్టి, ఆత్మకు శాంతి చేకూరడానికి, ప్రశాంత వాతావరణం కోసం ఈ తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తారు.


