News April 4, 2025

డోర్నకల్: కుమారులకు విషం ఇచ్చిన తల్లికి రిమాండ్:CI

image

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం జోగ్య తండా గ్రామంలో ఫిబ్రవరి 5 న గ్రామానికి చెందిన వాంకుడోత్ ఉష మహిళా తన భర్త వెంకటేష్ కు అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నారని ఇద్దరు పిల్లలకు తుమ్బసబ్ లో మందు కలిపి ఇచ్చింది. కుమారుడు వరుణ్ తేజ్ కోలుకోగా,కుమార్తె నిత్యా శ్రీ మృతి చెందింది. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి తల్లి ఉష ను రిమాండ్ కోసం కోర్ట్ కు పంపనైందని డోర్నకల్ సిఐ రాజేష్ గురువారం తెలిపారు.

Similar News

News April 23, 2025

దొర్నిపాడులో 43.9°C ఉష్ణోగ్రత

image

నంద్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. మంగళవారం జిల్లాలోని దొర్నిపాడులో 43.9°C ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఉదయం 9 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మరోవైపు భగ్గుమంటున్న ఎండల వేళ శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

News April 23, 2025

కర్నూలులో 43.5°C ఉష్ణోగ్రత

image

కర్నూలు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యప్రతాపానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. మంగళవారం కర్నూలులో 43.5°C ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. ఉదయం 9 గంటలకే వాతావరణం వేడెక్కుతుండటంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మరోవైపు భగ్గుమంటున్న ఎండల వేళ శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

News April 23, 2025

ఈనెల 30న పాలిసెట్ పరీక్ష: DRO

image

ఈ నెల 30న పాలిసెట్ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందని DRO శ్రీనివాస మూర్తి తెలిపారు. మంగళవారం ఆయన ఛాంబర్‌లో పరీక్ష నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 8,083 మంది అభ్యర్థులు 23 కేంద్రాల్లో హాజరు కానున్నారని తెలిపారు. విజయనగరంలో 9 కేంద్రాలు, బొబ్బిలిలో 6 కేంద్రాలు, గజపతినగరంలో 8 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

error: Content is protected !!