News February 2, 2025

డోర్నకల్: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

image

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సోమేశ్వరరావు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సహచర కానిస్టేబుల్ మృతిపై డోర్నకల్ పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Similar News

News November 21, 2025

గాంధీభవన్: ఓటర్ ఇన్‌ఫర్‌మేషన్‌ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలి: ఎమ్మెల్యే

image

ఓటర్ ఇన్‌ఫర్‌మేషన్‌ను పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఓట్ చోర్ గద్దె చోడ్ సిగ్నేచర్ కమిటీకి తనను ఛైర్మన్‌గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. కమిటీ అంతా కలిసి పనులు విభజన చేసుకొని జిల్లా పర్యటనలు చేస్తామని చెప్పారు. డిజిటల్ ఓటర్ లిస్ట్ ఈసీ ప్రచురించాలని, అప్పుడే దొంగ ఓట్లు వేయడం ఆగుతుందన్నారు. ఓట్ చోరీకి బీజేపీ ఎలా పాల్పడుతుందో వివరిస్తామని వెల్లడించారు.

News November 21, 2025

అభివృద్ధి పనులను సమర్థవంతంగా నిర్వహించండి: ఎంపీ చిన్ని

image

ఇంద్రకీలాద్రి కొండపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం మాస్టర్ ప్లాన్, అభివృద్ధి పనులను సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించాలని ఎంపీ కేశినేని చిన్ని అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న పనులపై అధికారులతో ఆయన సమీక్ష చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న‌, ఆల‌య ఛైర్మ‌న్ బొర్రా గాంధీ, ఈవో శీనానాయక్‌తో కలిసి మహామండపం, కనకదుర్గనగర్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు.

News November 21, 2025

23న పెళ్లి.. స్మృతికి మోదీ గ్రీటింగ్స్

image

స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి డేట్ ఫిక్స్ అయింది. మరో మూడు రోజుల్లో అంటే ఈ నెల 23న ఆమె తన ప్రియుడు పలాశ్ ముచ్చల్‌తో ఏడడుగులు వేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మంధాన-ముచ్చల్ జోడీకి గ్రీటింగ్స్ తెలుపుతూ లేఖ రాశారు. వివాహ బంధంలో ఎల్లప్పుడూ ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. కాగా స్మృతి-పలాశ్ ఎంగేజ్‌మెంట్ ఇప్పటికే పూర్తయింది.