News February 2, 2025
డోర్నకల్: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పోలీస్ స్టేషన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్లో రైటర్గా విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సోమేశ్వరరావు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. దంతాలపల్లి మండలం పెద్ద ముప్పారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సహచర కానిస్టేబుల్ మృతిపై డోర్నకల్ పోలీసులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Similar News
News October 20, 2025
ప్రపంచం మొత్తానికి మీరు బాసా?.. ట్రంప్పై ఖమేనీ ఫైర్

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్పై విరుచుకుపడ్డారు. ‘మీరు మా న్యూక్లియర్ సైట్లను ధ్వంసం చేశామని చెబుతున్నారు. మీ ఊహల్లో మీరు ఉండండి’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీరు మా సైంటిస్టులను చంపేశారు. కానీ వారి నాలెడ్జ్ను కాదు. ఒక దేశానికి న్యూక్లియర్ ఇండస్ట్రీ ఉంటే మీకు ఎందుకు? జోక్యం చేసుకోవడానికి మీరు ఎవరు? ప్రపంచం మొత్తానికి మిమ్మల్ని ఎన్నుకున్నారా?’ అని ప్రశ్నించారు.
News October 20, 2025
విశాఖ: గమనిక.. LTT ఎక్స్ప్రెస్ రెండు గంటలు ఆలస్యం

విశాఖపట్నం నుంచి ముంబై వెళ్లే LTT లోకమాన్య తిలక్ టెర్మినస్ (18519) ఎక్స్ప్రెస్ సోమవారం రీ షెడ్యూలు అయింది. విశాఖలో సోమవారం(అక్టోబర్ 20) రాత్రి 11.20 గంటలకు బయలదేరాల్సిన ఈ రైలు.. మంగళవారం అర్ధరాత్రి 1 గంటకు బయలుదేరేలా మార్పు చేసినట్లు విశాఖలోనీ రైల్వే అధికారులు తెలిపారు. లింక్ రేక్ ఆలస్యం కారణంగా రీషెడ్యూల్ జరిగినట్లు ప్రకటించారు. ప్రయాణికులు ఇది గమనించి సహకరించాలని కోరారు.
News October 20, 2025
ప్రభుత్వం డీఏ జీఓను సవరించాలి: విజయ్

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కరవు భత్యాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ జారీచేసిన 60, 61 జీఓలు అసంబద్ధంగా ఉంటూ ఉద్యోగికి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని, వెంటనే జీవోలను సవరించాలని ఏపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. డీఏ అరియర్స్ పదవీ విరమణ తర్వాత చెల్లిస్తామని అనడం సరైనది కాదన్నారు.