News April 14, 2025
డోర్నకల్, భద్రాచలం రైల్వే లైన్ డబ్లింగ్కు గ్రీన్ సిగ్నల్

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్-భద్రాచలం రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు ఎట్టకేలకు అనుమతి లభించింది. 2008లో ప్రారంభమైన ప్రతిపాదనలు పలు కారణాలతో ఆగిపోయాయి. ఈ లైన్తో దూరం తగ్గడంతో పాటు గూడ్స్ రవాణా, హైదరాబాద్ నుంచి భద్రాచలం వచ్చే ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో రైల్వేశాఖ అధికారులు డబ్లింగ్ పనులకు పచ్చజెండా ఊపారు.
Similar News
News November 15, 2025
సూర్యాపేట: ఆర్ఎంపీల కమీషన్ దందా..!

సూర్యాపేట జిల్లాలో ఆర్ఎంపీల కమీషన్ దందా నడుస్తోంది. ఎక్కువ కమీషన్ ఇచ్చే ప్రైవేటు ఆసుపత్రులకు ఆర్ఎంపీలు రోగులను రిఫర్ చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని ఆస్పత్రులు ప్రతి కేసుకూ ఆర్ఎంపీలకు భారీగా కమీషన్లు ఇస్తున్నట్లు సమాచారం. ఈ కారణంగానే రోగులు అధిక ఖర్చుల భారాన్ని మోయాల్సి వస్తోంది. అధికారులు తక్షణమే స్పందించి, ఈ అక్రమ దందాను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
News November 15, 2025
NRPT: గుర్తుతెలియని మృతదేహం లభ్యం

నారాయణపేట మండలంలోని గడ్డమీద అప్పంపల్లి వద్ద గుర్తు తెలియని మృతదేహం శనివారం లభ్యం అయింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, పూర్తిగా కుళ్లిపోయి గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 15, 2025
ఇక గాంధీ భవన్ చూపు.. గ్రేటర్ HYD వైపు..!

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూబ్లీహిల్స్లో ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. ఈ టెంపోను ఇలాగే కొనసాగించాలని అధిష్ఠానం భావిస్తోంది. అందుకే ఈ విజయం స్ఫూర్తితో జీహెచ్ఎంసీలో పాగా వేయాలని గాంధీభవన్ ప్లాన్ వేస్తోంది. ఈ మేరకు నాయకులు కేడర్కు దిశానిర్దేశం చేయనుంది. గ్రేటర్ HYDలో పక్కాగా ప్లాన్ వేసి వందకు తగ్గకుండా కార్పొరేటర్ సీట్లు సాధించి మేయర్ సీటు పట్టాలని ఆశిస్తోంది.


