News February 2, 2025
డోర్నకల్: వ్యక్తి ఆత్మహత్య.. ముగ్గురికి రిమాండ్

డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం గ్రామానికి చెందిన పగడాల సతీశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. చేతన చావుకి ముగ్గురు కారణమని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు డోర్నకల్ సీఐ రాజేశ్ తెలిపారు. నిందితులలో సుంకర వెంకన్న, అతని కుమారులు సుంకర పవన్, సుంకర చరణ్ వేధింపుల వల్లనే సతీశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.
Similar News
News October 28, 2025
SRCL: ‘రోగులకు చిత్తశుద్ధితో వైద్యం అందించాలి’

వైద్యులు రోగులకు చిత్తశుద్ధితో వైద్య సేవలు అందించాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఇన్చార్జి కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ముందుగా దవాఖానలోని మెటర్నిటీ, ఆప్తమాలజీ, ఎమర్జెన్సీ వార్డులు, రక్త పరీక్షల ల్యాబ్ను పరిశీలించారు. వైద్య సేవలు పొందుతున్న వారితో మాట్లాడారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
News October 28, 2025
MHBD: ముంచుకొస్తున్న తుపాన్.. రైతన్నకు పరేషాన్..!

వాతావరణ శాఖ ప్రకటించిన మోంథా తుపాన్ ప్రభావం మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో జిల్లాలోని వ్యవసాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇటీవల వర్షాలతో మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాబోయే తుపాన్ను తలుచుకొని వరి, పత్తి, మిరప సాగు చేస్తున్న రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు.. వర్షాలతో నష్టపోతున్నామని కన్నీరు పెడుతున్నారు.
News October 28, 2025
కర్నూలు: గృహ నిర్మాణంపై చర్చించిన హౌసింగ్ డైరెక్టర్

కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన ఆరేకల్ రామకృష్ణ మంగళవారం హౌసింగ్ ప్రోగ్రామింగ్ డైరెక్టర్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇద్దరూ జిల్లా గృహ నిర్మాణ ప్రగతిపై, అలాగే 2014–2019 మధ్య పెండింగ్లో ఉన్న హౌసింగ్ బిల్లుల పరిష్కారం వంటి అంశాలపై విశదంగా చర్చించారు.


