News February 2, 2025
డోర్నకల్: వ్యక్తి ఆత్మహత్య.. ముగ్గురికి రిమాండ్

డోర్నకల్ మండలం తోడేళ్లగూడెం గ్రామానికి చెందిన పగడాల సతీశ్ ఆత్మహత్య చేసుకున్నాడు. చేతన చావుకి ముగ్గురు కారణమని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించినట్లు డోర్నకల్ సీఐ రాజేశ్ తెలిపారు. నిందితులలో సుంకర వెంకన్న, అతని కుమారులు సుంకర పవన్, సుంకర చరణ్ వేధింపుల వల్లనే సతీశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.
Similar News
News January 11, 2026
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై కేటీఆర్ సమీక్ష

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ నాయకులతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం సమావేశమయ్యారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ మంత్రి పువ్వాడ, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ నాయక్, తాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
News January 11, 2026
ప.గో: ఖద్దరు ఓకే.. ఆదేశాల కోసం ఎదురు చూస్తున్న ఖాకి!

ఉమ్మడి ప.గో. జిల్లాలో రాజకీయ నేతలు ఇప్పటికే బిరుల(పందెం బరి) నిర్వాహకుల నుంచి సొమ్ములు వసూలు చేస్తుంటే ఖాకీలు మాత్రం ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే పోలీస్ శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ అధికారి తాను చేప్పేవరరకు వరకు అమ్యామ్యాలు తీసుకోవద్దు అంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. దీంతో పందాల నిర్వాహకులు మాత్రం ఆదేశాలు అందాయా.? లేదా.? అని పోలీసులను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
News January 11, 2026
ఉగ్రవాదులతో పాక్ ఆర్మీ దోస్తీ.. మరోసారి బయటపడిందిలా..!

పాక్ ఆర్మీకి ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలు మరోసారి బయటపడ్డాయి. పహల్గామ్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్, లష్కరే తోయిబా నేత సైఫుల్లా కసూరి.. పాకిస్థాన్లోని ఒక స్కూల్ ఫంక్షన్లో ప్రసంగించడం వెలుగులోకి వచ్చింది. పాక్ ఆర్మీ తనకు ఇన్విటేషన్లు పంపుతుందని, చనిపోయిన సైనికుల అంత్యక్రియలకు తనని పిలిచి ప్రార్థనలు చేయిస్తారని బహిరంగంగానే ఒప్పుకున్నాడు. ఇండియా తనని చూస్తేనే భయపడుతుందంటూ ఈ వేదికపై విషం చిమ్మాడు.


