News March 26, 2025

డోలీల ర‌హిత జిల్లాగా మార్చ‌డానికి పనిచేస్తున్నాం: కలెక్టర్

image

పార్వతీపురం మ‌న్యం జిల్లాను డోలీల ర‌హిత జిల్లాగా మార్చ‌డానికి ప్రణాళికాబ‌ద్దంగా ప‌నిచేస్తున్నామ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎ.శ్యామ్ ప్ర‌సాద్ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు తెలిపారు. 2వ రోజు జరిగిన జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో బుధవారం ఆయ‌న జిల్లా ప్ర‌గ‌తిపై ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ఇచ్చారు. జిల్లాలో గిరిజ‌నలు ఎక్కువ‌గా ఉన్నార‌ని,కొండ ప్రాంతాల్లో ర‌హ‌దారి స‌దుపాయం లేక డోలీలు ఉప‌యోగిస్తున్నార‌ని అన్నారు.

Similar News

News November 19, 2025

అల్పపీడనం.. రెండు రోజులు వర్షాలు!

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, తదుపరి 48 గంటల్లో ఇది మరింత బలపడి పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో గురువారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని పేర్కొంది. శుక్రవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

News November 19, 2025

కుక్క కాట్లు బాబోయ్.. ఘననీయంగా పెరిగిన సంఖ్య.!

image

ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా కుక్క కాటు కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఇ సంఖ్య అధికంగా ఉంది. NTR (D)లో గతేడాది 15వేల కుక్క కాటు బాధితులు ఉండగా, ఈఏడాది NOV 17నాటికే 16,893 కేసులు నమోదయ్యాయి. కుక్క కాటుపై అవగాహన పెరగడంతో చిన్న గాయమైనా వెంటనే ఆసుపత్రికి వచ్చి యాంటీ రేబిస్ ఇంజెక్షన్ చేయించుకుంటున్నారని వైద్యులు చెబుతున్నారు. NTRలో ప్రస్తుతం 11వేల ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి.

News November 19, 2025

జిల్లాలో పర్యటించనున్న షెడ్యూల్డ్ కులాల కమీషన్: కలెక్టర్

image

ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల కమిషన్ చైర్మన్ జవహర్ ఆధ్వర్యంలో కమిటీ జిల్లాలో శుక్రవారం పర్యటించనుంది. కలెక్టర్ రాం సుందర్ రెడ్డి వివరాల ప్రకారం.. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్‌లో షెడ్యూల్డ్ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.