News April 21, 2025

డోలీ మోతలు లేకుండా చేస్తాం: మంత్రి సంధ్యారాణి

image

అల్లూరి సీతారామరాజు జిల్లా కించుమాందాలో రూ. 440 లక్షల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జ్‌ను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. ఈ బ్రిడ్జ్ గ్రామ అభివృద్ధిలో కీలకమైన ముందడుగని మంత్రి తెలిపారు. డోలీ మోతలు లేకుండా అన్ని గిరిజన తండాలకు రోడ్లు వేస్తామని తెలిపారు. ప్రజలు, అధికారులు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.

Similar News

News April 22, 2025

నిర్మల్ : పోలీసులపై నమ్మకం పెరిగేలా పనిచేయాలి: SP

image

ప్రజలకు పోలీసులపై మరింత నమ్మకం పెరిగేలా విధులు నిర్వహించాలని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని ఆయా కేసుల్లో నిందితులకు పడే శిక్షల శాతం మరింత పెరిగేలా ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. పట్టణాల్లో దొంగతనాలు జరగకుండా రాత్రి వేళలో గస్తీని మరింత పెంచాలన్నారు.

News April 22, 2025

K.G.Hలో టీచర్లకు వైద్య శిబిరాలు 

image

బదిలీల్లో ప్రాధాన్యత క్యాటగిరీ కిందకు వచ్చే ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ నెల 24 నుంచి 26 వరకు K.G.Hలో ప్రత్యేక వైద్య శిబిరానికి హాజరుకావాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ కోరారు.‌ 24న విశాఖ, 25న అనకాపల్లి, 26న అల్లూరి జిల్లాలకు చెందినవారు వైద్య శిబిరాలకు హాజరు కావాలన్నారు. ఈ శిబిరంలో పొందిన సర్టిఫికెట్ల ఆధారంగా కేటగిరీలను వర్గీకరిస్తామని తెలిపారు.

News April 22, 2025

NRPT: అంబేడ్కర్‌ను అవమానించింది కాంగ్రెస్: BJP

image

రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి అడుగడుగునా అవమానించిందని జిల్లా ఎస్సీమోర్చా ఇంఛార్జి, మాజీ ఎంపీ ముని స్వామి అన్నారు. అంబేడ్కర్ జయంతి వారోత్సవాల సందర్భంగా సోమవారం నారాయణపేటలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్ అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజ్యంగాన్ని అంబేడ్కర్ ఆశయాలను నెరవేస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు.

error: Content is protected !!