News March 5, 2025
డ్యూ బాల్ ప్రధాన కార్యదర్శిగా నల్లమల క్రీడాకారుడు

రాష్ట్ర డ్యూ బాల్ ప్రధాన కార్యదర్శిగా అచ్చంపేట మండలం దేవులపాడుకు చెందిన సభవత్ బాబు నాయక్ను నియమించినట్లు డ్యూ బాల్ ఇండియా అధ్యక్షులు ఫిరోజ్ ఖాన్ వెల్లడించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో డ్యూ బాల్ క్రీడను విస్తరించి, క్రీడాకారులు రాణించేలా కృషి చేస్తానన్నారు. జాతీయ స్థాయిలో రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తానని చెప్పారు.
Similar News
News January 14, 2026
పండుగల్లో ఇలా రెడీ..

పండుగల్లో మహిళలకు పని, పూజ, ఇంటి అలంకరణ ఇలా బోలెడుంటాయి. చివరికి అన్నీ పూర్తి చేసుకొనే సమయానికి రెడీ అయ్యే టైం ఉండదు. అందుకే పండుగరోజు వేసుకొనే దుస్తులు, గాజులు, పిన్నులు అన్నీ పక్కన పెట్టుకోండి. సులువుగా ఉండే హెయిర్ స్టైల్ వేసుకోండి. తక్కువ మేకప్కి ప్రాధాన్యమివ్వండి. కాస్త పెద్దబొట్టు పెడితే సంప్రదాయ వస్త్రాలకు నప్పుతుంది. అన్నీ సర్దుకున్నాకే చీరకట్టుకుంటే కంగారుగా అటూ ఇటూ తిరగాల్సిన పనుండదు.
News January 14, 2026
సిప్లో ఏటా పెరుగుతున్న పెట్టుబడులు!

సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్(SIP)లో ఏటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. 2025లో మదుపరులు మ్యూచువల్ ఫండ్ పథకాల్లో రూ.3.34 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు పెట్టారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. సురక్షిత పెట్టుబడి, ఆర్థిక క్రమశిక్షణ, దీర్ఘకాలిక సంపద సృష్టిగా ఇన్వెస్టర్లు భావించడమే దీనికి కారణమని తెలుస్తోంది. కాగా 2023లో రూ.1.84 లక్షల కోట్లు, 2024లో రూ.2.68 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
News January 14, 2026
గాలిపటాల వేళ అప్రమత్తత అవసరం: ఎస్పీ నితికా పంత్

సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగురవేసేటప్పుడు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు. విద్యుత్ తీగలు, ప్రమాదకర ప్రాంతాల్లో పటాలు ఎగురవేయవద్దని కోరారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ ఆనందాన్ని ఇబ్బందుల పాలు చేసుకోకుండా, నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా జరుపుకోవాలని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


