News February 20, 2025
డ్రంకన్ డ్రైవ్.. ముగ్గురికి జైలు, 15 మందికి జరిమానా

డ్రంకన్ డ్రైవ్ పట్టుబడిన ముగ్గురికి జైలు, 15 మందికి జరిమానా విధిస్తూ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ తీర్పు చెప్పారని నిజామాబాద్ ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పట్టుబడిన కోటగల్లీకి చెందిన శ్రీనివాస్, ఖిల్లా రోడ్కు చెందిన ఎండీ అఖిల్కు రెండు రోజుల చొప్పున జైలు శిక్ష విధించారన్నారు. అలాగే 15 మందికి రూ. 36,200 జరిమానా విధించినట్లు వివరించారు.
Similar News
News March 14, 2025
NZB: తల్లిని హత్య చేసిన కూతురు

నిజామాబాద్ నగరంలోని నాగారం 300 క్వార్టర్స్ దారుణం చోటుచేసుకుంది. ఓ కూతురు తన భర్తతో కలిసి కన్న తల్లిని హత్య చేసింది. స్థానికుల కథనం ప్రకారం.. బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన విజయ(60) భర్త చనిపోగా కూతురు సౌందర్య, అల్లుడితో కలిసి ఉంటోంది. శుక్రవారం తన తల్లికి గుండెపోటు వచ్చి చనిపోయిందని సౌందర్య నమ్మించే ప్రయత్నం చేయగా విజయ గొంతుపై గాయాలు ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
News March 14, 2025
నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..!

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. అత్యధికంగా లక్మాపూర్, మోస్రా, మగ్గిడి, ఎర్గట్ల ప్రాంతాల్లో 40.2℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు మల్కాపూర్, ఆలూర్, గోపన్నపల్లి, వెంపల్లె, తొండకూర్లో 40℃, మాచర్ల, మోర్తాడ్, నిజామాబాద్, మెండోరా 39.9, పోతంగల్, కోటగిరి 39.8, పెర్కిట్ 39.7, మంచిప్ప 39.6, నందిపేట 39.5, ఇస్సాపల్లె, ఎడపల్లె 39.4, బాల్కొండ, జానకంపేట్ 39.2, జక్రాన్పల్లి, కమ్మర్పల్లిలో 39.1℃గా నమోదైంది.
News March 14, 2025
NZB: పోలీసుల కస్టడీలో ఉన్న వ్యక్తి అనుమానాస్పద మృతి

NZBలో పోలీసుల కస్టడీలో ఉన్న ఒక గల్ఫ్ ఏజెంట్ మృతిచెందాడు. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాలు..పెద్దపల్లి, జగిత్యాలకు చెందిన గల్ఫ్ ఏజెంట్లు సంపత్, చిరంజీవి కలిసి గల్ఫ్కు కొందరిని పంపించారు.తీరా అక్కడికి వెళ్లిన వారికి పని లేకపోవడంతో వారు తిరిగొచ్చి సంపత్,చిరంజీవిపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టు ద్వారా 2రోజుల క్రితం కస్టడీలోకి తీసుకోగా సంపత్ మృతిచెందాడు.