News April 12, 2025
డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన కాజీపేట పోలీసులు

రోడ్డు ప్రమాదాల నివారణతో నేరస్థులను గుర్తించడంలో భాగంగా కాజీపేట్ ఎస్ఐ లవణ్ కుమార్ తన సిబ్బందితో కలిసి బంధం చెరువు ప్రాంతంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులపై కేసు నమోదు చేసి వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. మద్యం సేవించి వాహనం నడపడం నేరమని ఎస్ఐ వాహనదారులను హెచ్చరించారు.
Similar News
News October 16, 2025
జనగామ: 18న విద్యాసంస్థల బంద్: జేఏసీ

బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్త కార్యాచరణలో భాగంగా ఈనెల 18న జనగామ జిల్లాలోని విద్యాసంస్థలను బంద్ చేయనున్నట్లు బీసీ జేఏసీ ప్రతినిధులు తీర్మానించారు. కావున ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, ప్రభుత్వరంగ పరిధిలోని విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్కు సహకరించాలని కోరారు.
News October 16, 2025
మంగళగిరి: ‘పవన్ కళ్యాణ్ను కలిసేదాకా ఊరెళ్లను’

బెట్టింగ్ యాప్ల వల్ల తనలా ఎవరూ నష్టపోకూడదని సాయి కుమార్ అనే యువకుడు పాదయాత్ర చేస్తూ వైజాగ్ నుంచి మంగళగిరి జనసేన ఆఫీసుకు వచ్చాడు. బెట్టింగ్ యాప్ల వలలో పడి రూ.20 లక్షలు నష్టపోయానని తెలిపాడు. మరొకరు ఇలా నష్టపోకూడదని అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఈ యాప్లపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆఫీసు ముందు నిరసనకు దిగారు. పవన్ను నేరుగా కలిసి విన్నవించాకనే వెళ్తానంటున్నాడు.
News October 16, 2025
సిరిసిల్ల: 5 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే ఛాన్స్

సీసీఐ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలని సిరిసిల్ల కలెక్టర్ ఎం.హరిత అన్నారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో పత్తి మొబైల్ యాప్ను ఆమె బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం జిల్లాలో సుమారు 5 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి అయ్యే అవకాశం ఉందన్నారు. గతేడాది జిల్లాలో ప్రభుత్వం 2,46,000 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిందన్నారు.