News April 12, 2025

డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషిచేయాలి: కలెక్టర్

image

మత్తు పదార్థాల నిర్మూలనకై ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని సమాజానికి తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, SP నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేటలో ఎక్సైజ్, విద్యాశాఖ, జిల్లా సంక్షేమ, వ్యవసాయ, పోలీస్, వివిధ శాఖల అధికారులతో మాదకద్రవ్య నిర్మూలనపై సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాలన్నారు.

Similar News

News October 17, 2025

మంత్రి లోకేశ్‌పై వైసీపీ సెటైరికల్ పోస్ట్

image

ఏపీలో పరిశ్రమల ఏర్పాటుపై Xలో TDP, YCP సెటైరికల్ పోస్టులు పెడుతున్నాయి. ‘గూగుల్‌ను సమర్థించలేక, ఎలా విమర్శించాలో అర్థంకాక YCP గుడ్డు బ్యాచ్ గుడ్డు మీద ఈకలు పీకుతోంది’ అంటూ TDP అమర్నాథ్ ఫొటోను క్రియేట్ చేసి పోస్ట్ చేసింది. దీనిపై YCP స్పందిస్తూ ‘పరిశ్రమల ఏర్పాటుపై అమర్నాథ్ గుక్కతిప్పుకోకుండా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పప్పు గుత్తి తిప్పుకుంటున్న నిక్కర్ మంత్రి లోకేశ్’ అని పేర్కొంది.

News October 17, 2025

రసమయి బాలకిషన్‌పై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్ ఫిర్యాదు

image

మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ MLA రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు CP గౌష్ ఆలంకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. గోసి గొంగడి నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన రసమయి బాలకిషన్ ఈరోజు వందల కోట్ల ఆస్తులు, ఫామ్ హౌస్‌లు ఎలా సంపాదించారో బహిరంగంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు.

News October 17, 2025

మామునూర్ ఎయిర్‌పోర్ట్ భూసేకరణపై కలెక్టర్ సమీక్ష

image

మామునూర్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు సంబంధించి భూసేకరణపై కలెక్టర్ సత్య శారద కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వరంగల్‌లో ఎయిర్పోర్ట్ నిర్మాణం ప్రజల దీర్ఘకాల ఆకాంక్ష అని అన్నారు. హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందుతున్న రెండో రాజధానిగా వరంగల్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం కీలకం అని తెలిపారు.