News April 12, 2025

డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషిచేయాలి: కలెక్టర్

image

మత్తు పదార్థాల నిర్మూలనకై ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని సమాజానికి తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, SP నారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం వికారాబాద్ కలెక్టరేటలో ఎక్సైజ్, విద్యాశాఖ, జిల్లా సంక్షేమ, వ్యవసాయ, పోలీస్, వివిధ శాఖల అధికారులతో మాదకద్రవ్య నిర్మూలనపై సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరు కలిసి పనిచేయాలన్నారు.

Similar News

News December 10, 2025

ADB: యువతి SUICIDE.. రిమ్స్ వైద్యుడి ARREST

image

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన కేసులో రిమ్స్ జూనియర్ వైద్యుడు షోహెబ్ అలీని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. NZBకు చెందిన షోహెబ్, ADBకు చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతనికి వివాహమైన విషయం తెలిసి యువతి నిరాకరించగా, ఆమె ఫొటోలతో బెదిరించాడు. దీంతో NOV 26న పురుగు మందు తాగిన యువతి ఆదివారం మృతి చెందింది. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.

News December 10, 2025

తిరుపతి: ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం.. ఫోన్‌పే చేయడంతోనే!

image

తిరుపతిలో ర్యాపిడో డ్రైవర్ సాయికుమార్ ఓ బాలికను అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ర్యాపిడో బుక్ చేసినప్పుడు ఆ బాలిక ఫోన్ పే ద్వారా నగదు చెల్లించింది. ఆ నంబర్‌తో బాలికకు కాల్ చేసి ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె నిరాకరించింది. తర్వాత సాయి కుమార్ తన అక్కతో ఫోన్ మాట్లాడించాడు. ఫ్రెండ్స్‌గా ఉందామని.. ఏ అవసరం వచ్చినా కాల్ చేయడమన్నాడు. దీంతో బాలిక సాయం అడిగితే తీసుకెళ్లి అత్యాచారం చేశాడని సమాచారం.

News December 10, 2025

మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ

image

ఉక్రెయిన్‌లో మూడు నెలల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. అయితే యుద్ధ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలంటే మిత్రదేశాల నుంచి భద్రత, సహకారం అవసరమని చెప్పారు. మరోవైపు ప్రతిపక్షం కూడా ప్రస్తుతం ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని అభిప్రాయపడుతోంది.