News December 4, 2024

డ్రోన్ల వినియోగం విస్తృతం చేయండి: సీఎం 

image

అమరావతి: భద్రత, నేర నియంత్రణ, ప్రజా సేవలకు డ్రోన్ల వినియోగాన్ని విస్తృతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం వెలగపూడి సచివాలయంలో డ్రోన్ డెమోను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిర్వహణ, రవాణా సౌకర్యాలు లేని ప్రాంతాలకు మందుల పంపిణీ, పారిశుద్ధ్య చర్యల కోసం డ్రోన్లను వినియోగించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను కోరారు.

Similar News

News December 16, 2025

నేడు సీఎం చంద్రబాబు బిజీ డే షెడ్యూల్‌

image

@ 10:15 గంటలకు సచివాలయానికి చేరుకున్న సీఎం, రాష్ట్రంలో గేట్స్ ఫౌండేషన్ సేవల అమలుపై సమీక్ష నిర్వహించారు.
@ మధ్యాహ్నం 3:15 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్తారు.
@ సాయంత్రం 4:55 గంటలకు మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌కు చేరుకున్నారు. 5 గంటలకు కొత్తగా నియామకమైన కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించే కార్యక్రమంలో పాల్గొంటారు.
@ రాత్రి 7.20 గంటలకు సీఎం తన నివాసానికి చేరుకుంటారు.

News December 16, 2025

GNT: నిలకడగా స్క్రబ్ టైఫస్ రోగుల ఆరోగ్య పరిస్థితి

image

గుంటూరు జీజీహెచ్‌లో స్క్రబ్ టైఫస్ జ్వరాలతో చికిత్స పొందుతున్న రోగుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బుధవారం జీజీహెచ్‌కు వచ్చిన 13 మంది జ్వర బాధితుల నమూనాలను పరీక్షించగా, మంగళగిరి, అమృతలూరుకు చెందిన ఇద్దరికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఆ ఇద్దరిని ఇన్‌పేషెంట్లుగా చేర్చుకుని వైద్యం అందిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

News December 16, 2025

GNT: నూతన కానిస్టేబుల్స్‌తో నేడు సీఎం సమావేశం

image

పోలీసు శాఖలో నూతనంగా జాయిన్ అవుతున్న వారితో CM చంద్రబాబు మంగళగిరిలో నేడు సమావేశం కానున్నారు. 6,100 మందిని రిక్రూట్ చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో 6,014 మంది సెలక్ట్ అయ్యారు. వీరిలో 5,757 మంది ట్రైనింగ్‌కు ఎంపిక అయ్యారు. సివిల్ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, APSP కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపికవ్వగా సివిల్‌లో మహిళా కానిస్టేబుళ్లు 993 మంది ఉన్నారు. వీరికి ఈ నెల నుంచి ట్రైనింగ్ మొదలవుతుంది.