News March 5, 2025
డ్రోన్స్ పర్యవేక్షణలో ప్రశాంతంగా అమ్మవారి జాతర: SP

చీపురుపల్లిలో జరిగిన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జాతరను డ్రోన్స్ పర్యవేక్షణ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. ముందస్తు చర్యలతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూశామన్నారు. భక్తులు సులభతరంగా అమ్మవారిని దర్శించుకొనే విధంగా క్యూలైన్లను ఏర్పాటు చేయడం, త్వరితగతిన భక్తులను వరుస క్రమంలో పంపేటట్లు బందోబస్తు నిర్వహించామన్నారు.
Similar News
News April 11, 2026
కేజీబీవీలో ప్రవేశాలకు గడువు పొడిగింపు: డీఈవో

జిల్లాలోని కేజీబీవీలో 2026-27 ఏడాదికి 6,7,8,9,10, ఇంటర్మీడియట్లో ప్రవేశాల దరఖాస్తులను ఈనెల 20 వరకు పొడిగించినట్లు డీఈవో మాణిక్యం నాయుడు తెలిపారు. రేపటితో ప్రవేశాల దరఖాస్తుల ప్రక్రియ ముగిసినప్పటికీ, విద్యార్థుల తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు మరోసారి గడువు పొడిగించినట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బాలికలు దరఖాస్తు చేసుకోవాలని శుక్రవారం పేర్కొన్నారు.
News April 11, 2026
ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదు: జేసీ

ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లు, నెయ్యి విక్రయదారులు, స్వీట్, కిరాణా షాపులపై జేసీ సేతుమాధవన్ చర్యలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల్ మీరా నిర్వహించిన తనిఖీల్లో నాణ్యత లోపాలు బయటపడటంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన జేసీ, నిందితుల సమక్షంలో రూ.1,04,000 జరిమానా విధించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు.
News April 11, 2026
ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదు: జేసీ

ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని వాటర్ ప్లాంట్లు, నెయ్యి విక్రయదారులు, స్వీట్, కిరాణా షాపులపై జేసీ సేతుమాధవన్ చర్యలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ అధికారి నాగుల్ మీరా నిర్వహించిన తనిఖీల్లో నాణ్యత లోపాలు బయటపడటంతో పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులను విచారించిన జేసీ, నిందితుల సమక్షంలో రూ.1,04,000 జరిమానా విధించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని హెచ్చరించారు.


