News November 20, 2024

డ్రోన్ డ్రివెన్ పోలీసింగ్‌కు శ్రీకారం: ప్రకాశం SP

image

జిల్లా పోలీసులు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని డ్రోన్ కెమెరాల వినియోగంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో జిల్లా ఎస్పీ ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా.. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా పోలీస్ కానిస్టేబుల్స్‌కు ఎస్పీ దామోదర్ స్వయంగా డ్రోన్ ఆపరేట్ చేసి ఏవిదంగా వాడాలో తెలిపారు. ఏయే కోణాల్లో వాడాలి తదితర అంశాలపై మహిళా కానిస్టేబుల్స్‌కి వివరించారు.

Similar News

News January 7, 2026

మార్కాపురం: హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా అధికారి ఇతనే.!

image

మార్కాపురం జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ జిల్లా అధికారిగా శ్రీనివాస ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ హౌసింగ్ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు సమర్థవంతంగా చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నాణ్యతతో గృహాల నిర్మాణం పూర్తి చేయడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు.

News January 7, 2026

కనిగిరి హత్య కేసులో మరో ట్విస్ట్.!

image

వెలిగండ్ల మండలంలోని కట్టకిందపల్లిలో మహిళను చంపి, ఆపై AR కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మంగళవారం క్లూస్‌టీం రంగంలోకి దిగింది. సీనావలి, నాగజ్యోతి మృతదేహాలకు కనిగిరి ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. జ్యోతి మృతదేహాన్ని కట్టకిందపల్లికి తరలించేందుకు యత్నించగా మృతురాలి బందువులు న్యాయం చేయాలని పోలీసులను నిలదీశారు. వీరిరువురి మృతిపై <<18773256>>మూడవ వ్యక్తి ప్రమేయం<<>> ఉందేమోనని పోలీసులు ఆరాతీస్తున్నారు.

News January 7, 2026

ప్రకాశం: మోసంచేసి రన్నింగ్ బస్ దూకి మృతి

image

టంగుటూరుకు చెందిన మురళి చిలకలూరిపేట నుంచి ఒంగోలుకు RTC బస్సులో వస్తున్నాడు. జాగర్లమూడివారిపాలెంకి చెందిన గోపీనాథ్(24) అదే బస్సులో మేదరమెట్ల వద్ద ఎక్కాడు. తనకు రూ.200 ఫోన్‌పే చేయాలని మురళిని అడిగి కొడుతుండగా పాస్‌వర్డ్ గుర్తుపెట్టుకున్నాడు గోపీ. మరోసారి మురళిని ఫోన్ అడిగి రూ.90వేలు ట్రాన్ఫర్ చేసుకున్నాడు. మురళి గమనించి అడగగా గోపీ రన్నింగ్ బస్ నుంచి దూకాడు. తీవ్ర గాయాలు కాగా మంగళవారం చనిపోయాడు.