News November 20, 2024
డ్రోన్ డ్రివెన్ పోలీసింగ్కు శ్రీకారం: ప్రకాశం SP

జిల్లా పోలీసులు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని డ్రోన్ కెమెరాల వినియోగంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో జిల్లా ఎస్పీ ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా.. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా పోలీస్ కానిస్టేబుల్స్కు ఎస్పీ దామోదర్ స్వయంగా డ్రోన్ ఆపరేట్ చేసి ఏవిదంగా వాడాలో తెలిపారు. ఏయే కోణాల్లో వాడాలి తదితర అంశాలపై మహిళా కానిస్టేబుల్స్కి వివరించారు.
Similar News
News September 16, 2025
మార్కాపురం: రూ.25 వేల జీతంతో జాబ్స్

మార్కాపురంలోని ZP బాలికల ఉన్నత పాఠశాలలో ఈనెల 19వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. 10 జాతీయ కంపెనీలు పాల్గొంటున్నాయని, పది నుంచి పీజీ వరకు పూర్తి చేసిన నిరుద్యోగులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చన్నారు. ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి రూ.12 వేల నుంచి రూ. 25వేల వరకు జీతం అందుతుందన్నారు.
News September 16, 2025
ప్రకాశం జిల్లా యువతకు గుడ్ న్యూస్.!

ప్రకాశం జిల్లా ప్రభుత్వ, ప్రైవేట్ ITI కళాశాలల్లో నాలుగో విడత ప్రవేశాలకు కన్వినర్ ప్రసాద్ బాబు మంగళవారం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించారు. అర్హులైన అభ్యర్థులు iti.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఈనెల 27వ తేదీలోగా దరఖాస్తులు నమోదు చేసుకోవాలని తెలిపారు. జిల్లాలోని ఒకటికంటే ఎక్కువ ITIలను ఎంపిక చేసుకోవచ్చని, ప్రభుత్వ ITIలలో 29న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
News September 16, 2025
నాగార్జున యూనివర్సిటీ విద్యార్థులకు ముఖ్య గమనిక

నాగార్జున విశ్వవిద్యాలయం పీజీ రెండో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. MSC స్టాటిస్టిక్స్లో 45 మందికి గాను.. 44 మంది మంది ఉత్తీర్ణులయ్యారు. బయోకెమిస్ట్రీలో 24 మందిలో 17 మంది ఉత్తీర్ణులయ్యారని అధికారులు తెలిపారు. ఫలితాలపై అభ్యంతరాలున్నవారు ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచించారు. రీవాల్యూయేషన్ కోసం రూ.1860, వ్యక్తిగత పేపర్ వెరిఫికేషన్ కోసం రూ.2190 చెల్లించాలన్నారు.