News March 7, 2025
ఢిల్లీలో తన వాణి వినిపించిన ప.గో జిల్లా సర్పంచ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో పంచాయతీ శాఖ నిర్వహిస్తున్న వర్క్ షాప్లో ఉండి మండలం మహాదేవపట్నం గ్రామ సర్పంచ్ వెంకట సుబ్బలక్ష్మి శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అని అన్నారు. తమ గ్రామంలో చేసిన అభివృద్ధి, చేయబోయే కార్యక్రమాల గురించి ఆమె వర్క్ షాప్లో వివరించారు.
Similar News
News April 20, 2025
రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

భీమవరంలోని గరగపర్రు రోడ్డులో శుక్రవారం రాత్రి ఇద్దరు బీటెక్ విద్యార్థులు బైక్పై వెళుతూ ఎదురుగా వస్తున్న బైకుని తప్పించిపోయి డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో రాజమండ్రికి చెందిన జ్ఞాన సాగర్(21) తలకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఇజ్రాయెల్ శనివారం తెలిపారు. మరో విద్యార్థి సాయి భరత్ స్వల్ప గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు అయింది.
News April 20, 2025
డీఎస్సీ: ఉమ్మడి ప.గో జిల్లాలో ఎన్ని పోస్టులంటే?

రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. మొత్తం 16347 పోస్టులు భర్తీ చేయనున్నారు. కాగా ఉమ్మడి ప.గోలో 1035 కొలువులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఎస్ఏ తెలుగు 49, హిందీ 48, ఇంగ్లీష్ 85, మ్యాథ్స్ 45, ఫిజిక్స్ 42, జీవశాస్త్రం 59, సోషల్ 102, పీడీ 185, ఎస్జీటీ 417, ఎస్జీటీ ఉర్దూ 3 పోస్టులున్నాయి.
News April 20, 2025
‘డిప్యూటీ సీఎం ఫోటో మార్ఫింగ్ కేసులో వ్యక్తి అరెస్ట్’

మార్ఫింగ్ ఫోటోల ద్వారా సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కించపరిచే విధంగా వాఖ్యలు చేసిన చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తిని శనివారం భీమవరం పోలీసులు అదుపులో తీసుకున్నారు. పట్టణానికి చెందిన పత్తి హరివర్ధన్ ఫిర్యాదు మేరకు చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం సెతేరికి చెందిన చింతలపూడి పవన్ కుమార్పై కేసు నమోదు చేశారు. అతనికి 41 నోటీసు ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.