News June 24, 2024

ఢిల్లీలో శ్రీకాకుళం వాసి మృతి

image

నందిగాం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఆదివారం ఢిల్లీలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కామధేనువు గ్రామానికి చెందిన మధుబాబు మూడేళ్లుగా ఢిల్లీలో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం ఢిల్లీ రైల్వే స్టేషన్లో అపస్మారక స్థితిలో ఉన్న ఆయణ్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధు మృతి చెందాడు. ఆధార్ కార్డ్ ఆధారంగా ఢిల్లీ పోలీసులు స్థానికపోలీసులకు సమాచారం అందించారు.

Similar News

News October 6, 2024

SKLM: నేటి నుంచి IIITకి సెలవులు

image

ఎచ్చెర్లలోని IIIT క్యాంపస్‌కు నేటి నుంచి ఈనెల 13వ తేదీ వరకు దసరా సెలవులు ఇచ్చినట్లు డైరెక్టర్ బాలాజీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 14వ తేదీ సోమవారం తరగతులు తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News October 6, 2024

‘బంగారువలస-వైజాగ్ బస్సును పునరుద్ధరించండి’

image

వంగర కేంద్రంలో బంగారువలస నుంచి వైజాగ్ వెళ్లే బస్సును పునరుద్దరించాలని ప్రయాణీకులు విజ్ఞప్తి చేశారు. గత 8 నెలలగా బంగారు వలస వైజాగ్ సర్వీస్‌లను నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి బంగారువలస ద్వారా వంగర, రాజాం, విజయనగరం, మీదుగా ప్రయాణించే ఉద్యోగులు వ్యాపారస్తులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సును పునరుద్దరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.

News October 5, 2024

SKLM: ప్రజలకు మరింత చేరువగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ: ఎస్పీ

image

ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ప్రజలకు మరింత చేరువగా ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి పేర్కొన్నారు. ప్రతీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు, అదేవిధంగా ప్రతీ శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజల ఫిర్యాదులు స్వీకరణ ఉంటుందని ప్రజలకు తెలిపారు.