News November 15, 2024
ఢిల్లీలో సీఎం చంద్రబాబుకు విజయనగరం ఎంపీ వినతి

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబును.. అక్కడి విమానాశ్రయంలో కలిసి ఆహ్వానం పలికారు. చెన్నైలో మాదిరిగా జిల్లాలో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబుకు వినతిపత్రం అందజేసినట్లు ఎంపీ తెలిపారు.
Similar News
News October 29, 2025
విజయనగరం కలెక్టర్ కీలక ఆదేశాలు

జిల్లాలో తుఫాన్ కారణంగా జరిగిన నష్టాల అంచనాలను తక్షణం పంపించాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులకు బుధవారం ఆదేశించారు. శాఖలవారీగా నిజమైన వివరాలు, ఫొటోలు సహా అంచనాలు పంపాలని సూచించారు. మత్స్యకారులకు ప్రభుత్వం ప్రకటించిన 50 కేజీల బియ్యం సహాయాన్ని వెంటనే అందించాలని మత్స్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో 24 గంటలు కృషి చేసిన అధికారులు, సచివాలయ సిబ్బందిని అభినందించారు.
News October 29, 2025
గజపతినగరంలో రోడ్డు ప్రమాదం.. కారు దిగిన కలెక్టర్

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పర్యటనలో ఉన్న కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గజపతినగరం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని బుధవారం గమనించారు. వాహనాన్ని ఆపి గాయపడిన వ్యక్తులకు ధైర్యం చెప్పారు. అనంతరం అంబులెన్సును ఏర్పాటు చేయించి తక్షణ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గోల్డెన్ అవర్లో అందించిన సాయం మనిషి ప్రాణాలను కాపాడుతుందని, ప్రాణం కంటే విలువైనది మరేమీ లేదన్నారు.
News October 29, 2025
రేషన్ సరకుల పంపిణీ శతశాతం పూర్తి కావాలి: VZM కలెక్టర్

రేషన్ పంపిణీ బుధవారం లోగా శతశాతం పూర్తి కావాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. అధికారులతో మంగళవారం రాత్రి జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. నవంబరు నెల రేషన్ సరకుల పంపిణీని ముందుగానే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిందని, ఇప్పటికే జిల్లాలో పంపిణీ మొదలయ్యిందని చెప్పారు. బుధవారం నాటికి అన్ని గ్రామాల్లో శతశాతం పూర్తి చేయాలని ఆదేశించారు.


