News February 2, 2025
ఢిల్లీ ఎన్నికల్లో విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రచారం

దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఢిల్లీలోని షాలిమార్ ప్రాంతంలో ఆయన తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే కాలనీలో ప్రచారం చేశారు. ఆయన వెంట పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన ఆటోలో ప్రయాణించారు.
Similar News
News October 17, 2025
విశాఖ డీఆర్వో Vs ఆర్డీవో

విశాఖ DRO భవానీ శంకర్, RDO శ్రీలేఖ మధ్య కోల్డ్ వార్ తారాస్థాయికి చేరింది. డీఆర్వోపై కలెక్టర్కు ఆర్డీవో ఇటీవల లేఖ రాయగా.. రెవెన్యూ సిబ్బంది కలెక్టర్ను శుక్రవారం కలిసి వినతిపత్రం అందించినట్లు సమాచారం. పచారీ సరుకుల కోసం తహశీల్దార్లకు ఇండెంట్లు పెడుతున్నారన్న RDOఆరోపణలపై ‘అవగాహన లేని అధికారి చేసిన ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదని’ DRO అన్నారు. కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
News October 17, 2025
విశాఖ: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

ఆరిలోవ BRTS రోడ్డులో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. విజయనగరం (D)కి చెందిన వినయ్ పురుషోత్తపురంలో ఉంటూ విశాఖలోని ఓ కాలేజీలో చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. వినయ్ తన మిత్రుడు ఉదయ్తో తిరిగొస్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో వినయ్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయ్ చికిత్స్ పొందుతున్నాడు.
News October 17, 2025
విశాఖలో యాక్సిడెంట్.. నవవధువు మృతి

విశాఖలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి చెందింది. దువ్వాడ పోలీసుల వివరాల ప్రకారం.. గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వైపుగా స్కూటీపై వెళ్తోన్న దంపతులను కూర్మన్నపాలెం జంక్షన్లో RTC బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉమాదేవి అక్కడికక్కడే మృతి చెందింది. భర్త పైడిరాజు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పెదగంట్యాడ (M) సీతానగరానికి చెందిన ఉమాదేవి, పైడిరాజుకి 4 నెలల క్రితమే పెళ్లి అయింది.