News April 12, 2025

ఢిల్లీ పార్టీలతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు:BRS

image

వరంగల్‌లో ఈ నెల 27న జరగనున్న బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. శనివారం క్యాతనపల్లి మున్సిపాలిటీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ రజజోత్సవ సభతో దేశం చూపు తెలంగాణ వైపు పడుతుందని.. ఢిల్లీ పార్టీలతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని, బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి కేసిఆర్‌ దూరదృష్టికి నిదర్శనమన్నారు.

Similar News

News April 14, 2025

బెల్లంపల్లిలో మహిళ అరెస్ట్

image

బెల్లంపల్లిలోని రైల్వే స్టేషన్ ముందు అక్రమంగా దేశీదారు విక్రయిస్తున్న మహిళను ఆదివారం అరెస్ట్ చేసినట్లు 2 టౌన్ ఎస్ఐ మహేందర్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు రైల్వే స్టేషన్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టగా కోట సారమ్మ వద్ద 9 లీటర్ల దేశీదారు మద్యం లభ్యమైందని పేర్కొన్నారు. మద్యాన్ని స్వాధీనం చేసుకొని ఆమెపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News April 14, 2025

సమ్మర్‌లో కీరదోసతో ఎన్నో లాభాలు!

image

* కీరదోసలోని 96% నీటి వల్ల డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తదు.
* అంతర్గత వాపు, కండరాల నొప్పిని తగ్గిస్తుంది.
* పొటాషియం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
* చర్మం ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది.
* నోటి దుర్వాసన తగ్గడంతో పాటు శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తుంది.
* బరువు తగ్గాలనుకునే వారికి కీరదోస మంచి ఆయుధం.
* కీరలోని డైయూరిటిక్‌ గుణాలు మూత్రం ద్వారా టాక్సిన్స్‌ బయటకు పంపుతాయి.

News April 14, 2025

చొప్పదండి: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

image

చొప్పదండి పట్టణం బీసీ కాలనీకి చెందిన గాజుల కనకలక్ష్మి (55) శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై మామిడాల సురేందర్ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు తమ తల్లిని చంపి మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెలతాడు ఎత్తుకుపోయారని కూతురు నాగమణి ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.

error: Content is protected !!