News February 8, 2025
ఢీల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738992450465_1259-normal-WIFI.webp)
ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో BJP విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే, ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర సహాయ మంత్రి, KNR MP బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్ను ఊడ్చేశారని అన్నారు. కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దని ఢిల్లీ ప్రజలు వద్దనుకుని BJPకి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించామని అన్నారు. తెలంగాణలో కూడా BJP అధికారంలోకి వస్తుందని తెలిపారు.
Similar News
News February 8, 2025
ఆటగాళ్ల ప్రాక్టీస్.. స్టేడియం ఫుల్..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739019874719_1032-normal-WIFI.webp)
ఇంగ్లండ్తో రేపు జరిగే రెండో వన్డే కోసం టీమ్ ఇండియా సిద్ధమవుతోంది. భారత ఆటగాళ్లు నెట్ సెషన్లో బిజీ బిజీగా గడిపారు. కాగా తమ అభిమాన ఆటగాళ్లను ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు భారీగా ఒడిశా కటక్లోని బారాబతి స్టేడియానికి తరలివచ్చారు. దీంతో స్టేడియం కిక్కిరిసిపోయింది. ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తుండగా వారు బిగ్గరగా అరుస్తూ మద్దతిచ్చారు. ఇందుకు సంబంధించి ఫొటో SMలో వైరల్గా మారింది.
News February 8, 2025
VD12 టీజర్కు NTR, సూర్య వాయిస్ ఓవర్?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739018433921_746-normal-WIFI.webp)
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తోన్న ‘VD12’ సినిమా టీజర్ ఈనెల 12న విడుదల కానుంది. అయితే, వివిధ భాషల్లో విడుదలవుతున్న ఈ టీజర్కు ఆయా ఇండస్ట్రీల స్టార్ హీరోలు వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. హిందీ టీజర్కు రణ్బీర్ కపూర్, తమిళంలో సూర్య, తెలుగుకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు టాక్. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
News February 8, 2025
నిబంధనలు పాటిస్తేనే అనుమతులు: కమిషనర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739015352366_51939331-normal-WIFI.webp)
నిబంధనలు పాటిస్తేనే భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేస్తామని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. వరంగల్ హనుమకొండ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు ఇవ్వాలన్నారు. హంటర్ రోడ్డు, యూనివర్సిటీ, శ్రీ సాయి నగర్, వరంగల్, ఆరెపల్లి ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి కొలతలు వేసి పరిశీలించారు. భవన నిర్మాణాలు చెప్పటానికి టీజీ బిపాస్ ద్వారా అనుమతుల జారీ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.