News February 8, 2025

ఢీల్లీ ఎన్నికల ఫలితాలపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

image

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో BJP విజయం దిశగా దూసుకెళ్తోంది. అయితే, ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కేంద్ర సహాయ మంత్రి, KNR MP బండి సంజయ్ స్పందించారు. ఢిల్లీ ప్రజలు చీపురుతో ఆప్‌ను ఊడ్చేశారని అన్నారు. కుంభకోణాలు, జైలు పార్టీలు మాకు వద్దని ఢిల్లీ ప్రజలు వద్దనుకుని BJPకి పట్టం కట్టారని పేర్కొన్నారు. ఢిల్లీలో కాషాయ జెండా ఎగురుతుందని ముందే ఊహించామని అన్నారు. తెలంగాణలో కూడా BJP అధికారంలోకి వస్తుందని తెలిపారు.

Similar News

News March 19, 2025

ట్యాక్స్ వసూళ్లలో జమ్మికుంటకు మొదటి స్థానం

image

ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో జమ్మికుంట మున్సిపాలిటీ 100% లక్ష్యాన్ని సాధించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అయాజ్ మాట్లాడుతూ.. ఈ ఘనత ప్రజల సహకారంతోనే సాధ్యమైందని.. అధికారులు, సిబ్బంది ముందుగా కార్యచరణ రూపొందించుకొని సమర్థవంతంగా పనిచేయడంతోనే ఈ లక్ష్యాన్ని సాధించామన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు.

News March 19, 2025

కరీంనగర్: మాదకద్రవ్యాల నిర్మూలనకు పకడ్బందీ చర్యలు: కలెక్టర్

image

మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, యువత మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మత్తుపదార్థాల నిర్మూలనలో భాగంగా పోలీస్, ఎక్సైజ్ సహా వివిధశాఖల అధికారులతో బుధవారం ఆమె సమన్వయ సమావేశం నిర్వహించారు. కళాశాలలో వివిధ వసతి గృహాలను సందర్శించాలన్నారు. అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసే విద్యార్థులు పెడదోవ పట్టకుండా చూడాలని ఆదేశించారు.

News March 19, 2025

కరీంనగర్: నలుగురు విద్యార్థులు డీబార్

image

కరీంనగర్ జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్ పరీక్షల్లో భాగంగా సెకండ్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ 2, ఎకనామిక్స్ పేపర్ 2లో నలుగురు విద్యార్థులు డీబార్ అయినట్లు జిల్లా విద్యాధికారులు తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 15,965 మంది విద్యార్థులకు గాను 15,563 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. పరీక్షలకు 402 మంది విద్యార్థులు హాజరు కాలేదని తెలిపారు.

error: Content is protected !!