News February 17, 2025

తంగళ్ళపల్లి: డైట్ మెనూ ప్రకారం భోజనం పెట్టాలి: కలెక్టర్

image

విద్యార్థులకు కామన్ డైట్ మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. తంగళ్లపల్లిలోని మైనార్టీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పబ్లిక్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిత్యం చదివించాలని ఆదేశించారు. ప్రిన్సిపాల్ రుసా, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News October 29, 2025

మిడ్జిల్‌లో అత్యధిక వర్షపాత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మిడ్జిల్ మండల కేంద్రంలో 119.0 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయింది. జడ్చర్ల 84.8, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 82.8, బాలానగర్ 68.0, నవాబుపేట మండలం కొల్లూరు 64.3, మూసాపేట మండలం జానంపేట 63.0, మహమ్మదాబాద్, రాజాపూర్ 53.0, భూత్పూర్ 41.5, మహబూబ్ నగర్ గ్రామీణం 43.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News October 29, 2025

APPLY NOW: ICMRలో ఉద్యోగాలు

image

ICMR-న్యూఢిల్లీ 8 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. MBBS/MD/MS/PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1500. SC/ST/PWBD/EWS/మహిళలకు ఫీజు లేదు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.icmr.gov.in/

News October 29, 2025

గొర్రె, మేక పిల్లల పెంపకం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

గొర్రె, మేక పిల్లలు పుట్టాక వారం వరకు రైతులు జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి నుంచి సరిపడా పాలు అందుతున్నాయా? లేదా? గమనించాలి. ఇది వాటి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెటర్నరీ డాక్టరు సూచన మేరకు దాణా అందించాలి. రెండు నుంచి ఐదు నెలల వరకు జొన్నలను దాణాగా ఇవ్వాలి. ఆ తర్వాత నానబెట్టిన మొక్కజొన్నలను పెట్టాలి. విటమిన్స్, కాల్షియం దాణాలో తగినంత ఉండేలా చూడాలి. పిల్లలకు 3 నెలల వయసులో డీవార్మింగ్ ప్రారంభించాలి.