News February 26, 2025

తండ్రి పోషణ విషయంలో గొడవలు.. ఆత్మహత్య

image

ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ కట్టకింది తండాలో కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు. తండాకు చెందిన కడావత్ రెడ్యా (26) అనే యువకుడికి తండ్రి పోషణ విషయంలో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవల విషయంలో మంగళవారం గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. తండ్రి, కొడుకుల మధ్య మాట పెరిగి క్షణికావేశంతో మనస్తాపం చెంది రెడ్యా తన పొలంలో చెట్టుకు ఉరి వేసుకున్నాడు.

Similar News

News March 15, 2025

ఖమ్మం: భార్యతో గొడవ.. భర్తను అప్పగించిన పోలీసులు

image

భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లగా మధిర పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఖమ్మం 3టౌన్‌కు చెందిన D.శ్రీనివాసరావు గత రెండు రోజుల క్రితం తన భార్యతో గొడవపడి, ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. శుక్రవారం మధిరలో ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందగా వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి శ్రీనివాసరావును కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News March 15, 2025

గుంటూరు ఛానల్‌లో గల్లంతైన బాలుడి మృతి 

image

పెదకాకాని మండలం నంబూరులోని గుంటూరు ఛానల్‌లో శుక్రవారం గల్లంతైన బాలుడు మృతి చెందాడు. స్థానిక అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన ప్రొక్లెయినర్‌ డ్రైవర్‌ ఏసురత్నం, సాంబమ్మ దంపతుల 2వ కుమారుడు జాషువా(12) స్థానిక జడ్పీ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు సెలవు కావడంతో గుంటూరు ఛానల్‌కు వెళ్లాడు. సరదాగా నీటిలో దిగుదామనే ప్రయత్నం చేస్తుండగా కాలుజారి కాలువలో పడి గల్లంతై మరణించాడు. 

News March 15, 2025

KNR: మోసాలకు గురవుతున్న వినియోగదారుడు!

image

మార్కెట్ ఏదైనా మోసాలకు గురవుతున్నది మాత్రం వినియోగదారుడే. తనకు జరిగిన అన్యాయాన్ని వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదులు చేయకపోవడం వల్ల వ్యాపారుల అక్రమాలకు గురవుతున్నారు. కరీంనగర్ జిల్లాలో న్యాయం చేయడానికి వినియోగదారుల ఫోరం కోర్టు ఉన్నా ప్రజల అవగాహన లేమితో వినియోగించుకుంటోంది తక్కువే. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం. వినియోగదారుల హక్కులను తెలుసుకొని వ్యాపారుల మోసాలకు అడ్డుకట్ట వేయండి.

error: Content is protected !!