News October 18, 2024

తంబళ్లపల్లె విద్యార్థిని తేజశ్వినికి సీఎం ప్రశంసలు

image

CA ఫలితాలల్లో ఆలిండియా 14వ ర్యాంకు, CMA పరీక్షల్లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించిన తంబళ్లపల్లె విద్యార్థిని తేజశ్వినిని CM చంద్రబాబు అభినందించారు. ఈ మేరకు ఆమె తన నాన్నతోపాటూ CMను అమరావతిలోని సచివాలయంలో  మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్థాయి ర్యాంకులతో ఏపీ పేరు ప్రతిష్ఠలను నిలపడం గర్వంగా ఉందని సీఎం అన్నారు.

Similar News

News January 1, 2026

చిత్తూరు అగ్రికల్చర్ జేడీ రిటైర్మెంట్

image

ఉద్యోగ జీవితంలో రిటైర్మెంట్ ఎంతో కీలకమని పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ తెలిపారు. చిత్తూరు జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ శాఖ జేడీ మురళీకృష్ణ ఉద్యోగ విరమణ సన్మాన సభ జరిగింది. ఎమ్మెల్యే హాజరయ్యారు. జేడీగా ఆయన ఉత్తమమైన సేవలందించారని ఎమ్మెల్యే కొనియాడారు. అనంతరం మురళీకృష్ణ దంపతులను సత్కరించారు.

News January 1, 2026

రూ. 210 కోట్లతో SC, ST కాలనీల అభివృద్ధి : కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో SC, ST కాలనీల అభివృద్ధికి రూ.210 కోట్లతో ప్రణాళికలు అమలు చేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం 31/12/2025 నాటికి రూ. 120 కోట్లతో SC,ST కాలనీలను అభివృద్ధి చేసేందుకు నిధులు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. జిల్లాలో 20 లక్షల జనాభా ఉండగా SC లు 4 లక్షలు, ST లు 65 వేలు ఉన్నారని, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రూ.210 కోట్లతో ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు.

News January 1, 2026

రూ. 210 కోట్లతో SC, ST కాలనీల అభివృద్ధి : కలెక్టర్

image

చిత్తూరు జిల్లాలో SC, ST కాలనీల అభివృద్ధికి రూ.210 కోట్లతో ప్రణాళికలు అమలు చేయనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం 31/12/2025 నాటికి రూ. 120 కోట్లతో SC,ST కాలనీలను అభివృద్ధి చేసేందుకు నిధులు ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. జిల్లాలో 20 లక్షల జనాభా ఉండగా SC లు 4 లక్షలు, ST లు 65 వేలు ఉన్నారని, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు రూ.210 కోట్లతో ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు.