News March 7, 2025
తక్కువ ధరలకే ఔషధ విక్రయాలు: ఎంపీ

జన ఔషధి కేంద్రలంలో తక్కువ ధరలకే నాణ్యమైన ఔషధాలు లభిస్తాయని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. పోస్టాఫీసు ఎదురుగా ఉన్న జన ఔషధి కేంద్రంలో జన ఔషధి దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బయట మెడికల్ షాపుల్లో బ్రాండెడ్ ఔషధ ధరలు ఆకాశాన్ని అంటున్నాయని.. ఇటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ధరలకే జన ఔషధి కేంద్రల ద్వారా విక్రయిస్తున్నాయన్నారు. ఈ ఔషధాలన్నీ బ్రాండెడ్ ఔషధాల మాదిరిగానే పనిచేస్తాయన్నారు.
Similar News
News March 19, 2025
VZM: 23న జరిగే అక్షరాస్యతా పరీక్షకు ఏర్పాట్లు

ఈ నెల 23వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ప్రాథమిక అక్షరాస్యతా పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని DRDA PD ఎ.కల్యాణచక్రవర్తి, వయోజన విద్య DD ఎ.సోమేశ్వర్రావు కోరారు. స్థానిక DRDA సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలు మధ్య లబ్దిదారులు వారికి వీలైన సమయంలో పరీక్ష నిర్వహిస్తామన్నారు.
News March 18, 2025
VZM: 23న జరిగే అక్షరాస్యతా పరీక్షకు ఏర్పాట్లు

ఈ నెల 23వ తేదీన జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ప్రాథమిక అక్షరాస్యతా పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని DRDA PD ఎ.కల్యాణచక్రవర్తి, వయోజన విద్య DD ఎ.సోమేశ్వర్రావు కోరారు. స్థానిక DRDA సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలు మధ్య లబ్దిదారులు వారికి వీలైన సమయంలో పరీక్ష నిర్వహిస్తామన్నారు.
News March 18, 2025
భోగాపురంలో బాంబు పేలి కార్మికుడి మృతి

భోగాపురంలో రాళ్లను పేల్చేందుకు ఏర్పాటు చేసిన బాంబు పేలి కార్మికుడు మృతి చెందాడు. ఈ ప్రమాదం సోమవారం జరిగింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనుల్లో భాగంగా రహదారి ఏర్పాటుకు అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించే క్రమంలో బాంబులు పెడుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో రామచంద్రపేటకు చెందిన కార్మికుడు కొత్తయ్య మృతి చెందాడు.