News May 3, 2024

తగ్గిన ఎమ్మెల్సీ ఓటు నమోదు.

image

2021లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో 5,05,565 మంది ఓటర్లు ఉండగా.. ఇటీవల ఎన్నికల సంఘం వెలువరించిన ఓటరు తుది జాబితా ప్రకారం 4,61,786 మంది ఓటర్లుగా నమోదయ్యారు. గతంలో పోల్చితే ఓటర్ల సంఖ్య తగ్గింది. పట్టభద్రులు ఓటు నమోదుపై ఆసక్తి చూపకపోవటమే దీనికి కారణం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా ఎన్నికలు జరిగే ప్రతిసారీ పట్టభద్రులు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

Similar News

News December 4, 2025

శాలౌగారారం: కాంగ్రెస్‌లో చేరి సర్పంచ్‌గా ఏకగ్రీవం

image

SLG సర్పంచి ఏకగ్రీవ ఎన్నిక నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ఇక్కడ సర్పంచ్ ఎన్నికల్లో మొత్తం 13 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వీరిలో 11మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా చివరికి కాంగ్రెస్, BRS సానుభూతిపరులు ఒక్కొక్కరు మాత్రమే బరిలో నిలిచారు. చివరి క్షణంలో BRS మద్దతుదారు గుజిలాల్ శేఖర్ బాబు కాంగ్రెస్‌లో చేరి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదృష్టం అంటే ఈయనదే మరి. ఏమంటారు మీరు.

News December 4, 2025

నిర్భయంగా ఓటు వేయండి: ఎస్పీ శరత్ చంద్ర పవార్

image

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ ఎలక్షన్ కోడ్‌ను పాటించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. నార్కట్‌పల్లి–యల్లారెడ్డిగూడెం గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటర్లు భయపడకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ శాఖ పూర్తి భద్రత కల్పిస్తుందని చెప్పారు. ఘర్షణలు, ప్రలోభాలు, నగదు పంపిణీపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

News December 4, 2025

నిర్భయంగా ఓటు వేయండి: ఎస్పీ శరత్ చంద్ర పవార్

image

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ప్రతి ఒక్కరూ ఎలక్షన్ కోడ్‌ను పాటించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ కోరారు. నార్కట్‌పల్లి–యల్లారెడ్డిగూడెం గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటర్లు భయపడకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలీస్ శాఖ పూర్తి భద్రత కల్పిస్తుందని చెప్పారు. ఘర్షణలు, ప్రలోభాలు, నగదు పంపిణీపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.