News February 12, 2026
తగ్గిన ధరలు.. రూ.50కే 4 కేజీల టమాటా

తెలుగు రాష్ట్రాల్లో టమాటాల ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో రూ.50కే 4 కేజీల టమాటాలు విక్రయిస్తున్నారు. అటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో రైతులకు కేజీకి రూ.5 మాత్రమే దక్కుతుండటంతో రోడ్లపైనే పడేస్తున్నారు. మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అటు ఉల్లిపాయల ధరలు సైతం తగ్గి కేజీ రూ.30 వరకు పలుకుతున్నాయి.
Similar News
News March 9, 2026
బేర్ పంజా.. సెన్సెక్స్ 2వేల పాయింట్లు క్రాష్!

యుద్ధం, క్రూడ్ ఆయిల్ ధరల ఎఫెక్ట్ ఈరోజు స్టాక్ మార్కెట్లపై భారీగా పడింది. సెన్సెక్స్ 2341 పాయింట్లు కోల్పోయి 76,605కు చేరగా.. నిఫ్టీ 700 పాయింట్లు కోల్పోయి 23,741 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్ సూచీలో అన్ని షేర్లు నష్టాల్లోనే ఉన్నాయి. రూపాయి విలువ సైతం జీవితకాల కనిష్ఠానికి చేరింది. ఒక డాలరుకు 92.30గా ఉంది. FII అమ్మకాలు కూడా మార్కెట్పై ప్రభావం చూపిస్తున్నాయి.
News March 9, 2026
మండే ఎండలు.. ఉరుములతో వర్షాలు

AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. నిన్న దాదాపు అన్ని జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కర్నూలులో 38.9, కడపలో 38.8 డిగ్రీల గరిష్ఠ టెంపరేచర్ రికార్డయింది. మరోవైపు ఉపరితల ద్రోణి ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఇవాళ కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడతాయని IMD వెల్లడించింది.
News March 9, 2026
దారుణం.. బీమా డబ్బు కోసం భర్తనే చంపేసింది

TG: అనారోగ్యంతో ఉన్న భర్తను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భార్య దారుణానికి పాల్పడిన ఘటన ఖమ్మంలో జరిగింది. అతడు కచ్చితంగా చనిపోతాడని రూ.66 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించింది. అయితే కొన్ని నెలలైనా మరణించకపోవడంతో డబ్బు కోసం పథకం వేసింది. భర్త రవికి మద్యం తాగించి మరో నలుగురితో కలిసి కారుతో ఢీకొట్టి చంపేసింది. బంధువుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేసి భార్య ప్రశాంతి, ఇతర నిందితులను అరెస్టు చేశారు.


