News March 29, 2025
తగ్గిన యాదాద్రిశుని నిత్య ఆదాయం

యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో భాగంగా శుక్రవారం 1,240 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా రూ.62,000, ప్రసాద విక్రయాలు రూ. 6,57,860, VIP దర్శనాలు రూ.1,65,000, బ్రేక్ దర్శనాలు రూ.86,700, ప్రధాన బుకింగ్ రూ.84,650, కార్ పార్కింగ్ రూ.1,72,500, వ్రతాలు రూ.63,200, తదితర విభాగాల నుంచి మొత్తం కలిపి రూ.14,49,694 ఆదాయం వచ్చినట్లు EO భాస్కర్ రావు తెలిపారు.
Similar News
News December 17, 2025
మొబైల్ ఫోన్లు కొనేవారికి షాక్!

వచ్చే ఏడాది స్మార్ట్ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘AI ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మొబైల్ ర్యామ్ కంటే AI సర్వర్ల చిప్స్కు ప్రాధాన్యం ఇస్తున్నాయి. హైఎండ్ DRAM వంటి కాంపోనెంట్స్ వాడటంతో ఫోన్ల ధరలూ పెరగొచ్చు. ఫోన్లలో 16GB RAM వేరియంట్లు కనుమరుగై గరిష్ఠంగా 12GBకే పరిమితం కావొచ్చు’ అని తెలిపారు. కాగా APPLE తన ఫోన్లపై ₹7వేలు, మిగతా కంపెనీలు ₹2వేల వరకూ పెంచనున్నాయి.
News December 17, 2025
ఈ రెండ్రోజులు శివారాధన చేస్తే?

శివారాధనకు నేడు(బుధ ప్రదోషం), రేపు(మాస శివరాత్రి) ఎంతో అనుకూలమని పండితులు చెబుతున్నారు. ఈరోజు సాయంత్రం బుధ ప్రదోష వ్రతం ఆచరించాలని సూచిస్తున్నారు. ఫలితంగా బుధుడి అనుగ్రహంతో పిల్లల్లో మానసిక సామర్థ్యం, వాక్పటిమ పెరుగుతాయని అంటున్నారు. మార్గశిర మాస శివరాత్రి రోజున చేసే శివ పూజలతో పాపాలు నశించి, కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం. ప్రదోష, శివరాత్రి పూజల విధానం, టైమింగ్స్ కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News December 17, 2025
తరచూ ఇల్లు మారుతున్నారా?

చాలామంది కెరీర్, ట్రాన్స్ఫర్లు, పిల్లల చదువుల కోసం ఊళ్లు మారుతూ ఉంటారు. అయితే తరచూ ఇళ్లను మారడం పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బాల్యంలో తరచూ ఇళ్లు మారుతోంటే పెద్దయ్యాక వాళ్లు డిప్రెషన్కు గురయ్యే అవకాశాలు ఎక్కువని యూనివర్సిటీ ఆఫ్ ప్లైమౌత్ చేసిన పరిశోధనలో వెల్లడైంది. పిల్లలకు చిన్నతనంలో స్థిరమైన బాల్యాన్ని అందించాల్సిన అవసరం ఉందంటున్నారు.


