News February 11, 2025
తగ్గిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఈరోజు భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, కళ్యాణకట్ట, వ్రతాలు, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ.18,59,854 ఆదాయం వచ్చిందన్నారు.
Similar News
News December 10, 2025
NZB: బాబోయ్.. చంపేస్తున్న చలి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయాన్నే బయటకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మంగళవారం 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మునుముందు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికితోడు పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లండి.
News December 10, 2025
MBNRలో హై ఓల్టేజ్ ఫైట్.. తండ్రి, కూతురు ఢీ

నారాయణపేట జిల్లా మాగనూరు మండలం కొల్పూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఎస్సీ జనరల్ స్థానం కోసం తండ్రి ముద్ధం రాములు, కూతురు ముద్ధం నవ్య శ్రీలు పోటీ పడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం వీరిద్దరే బరిలో నిలవడం విశేషం. అంతేకాక, వీరిద్దరూ వేర్వేరు రాజకీయ పార్టీల మద్దతుతో పోటీ చేస్తుండటంతో ఈ ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారింది. ఈనెల 17న కొల్పూర్ ఎన్నికల ఫలితం వెల్లడికానుంది.
News December 10, 2025
కృష్ణా: లంచాల భయం.. బీపీఎస్ మాకొద్దు బాబోయ్!

విజయవాడ, తాడిగడప, ఉయ్యూరు, గుడివాడ, మచిలీపట్నంలో అనధికార కట్టడాలు కోకొల్లలు. ఒక్క విజయవాడలో 10 వేలకు పైగా నిర్మాణాలు ఉంటే మిగతా చోట్ల 2వేల వరకు ఉన్నాయి. వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఇచ్చిన బీపీఎస్ (BPS) జీఓకు స్పందన కరవైంది. జరిమానాలు అధికంగా ఉండటం, రెగ్యులర్ చేయించుకునేందుకు వెళ్లిన వారిని అధికారులు భారీగా లంచాలు డిమాండ్ చేస్తుండటంతో రెగ్యులరైజేషన్కు ఎవరూ ముందుకు రావడం లేదు.


