News February 11, 2025
తగ్గిన యాదాద్రి శ్రీవారి నిత్య ఆదాయం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య ఆదాయ వివరాలు ఆలయ ఈవో భాస్కరరావు వెల్లడించారు. ఈరోజు భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో భాగంగా ప్రధాన బుకింగ్, ప్రత్యేక దర్శనాలు, ప్రసాద విక్రయాలు, కార్ పార్కింగ్, సువర్ణ పుష్పార్చన, కళ్యాణకట్ట, వ్రతాలు, తదితర విభాగాల నుండి మొత్తం కలిపి రూ.18,59,854 ఆదాయం వచ్చిందన్నారు.
Similar News
News November 22, 2025
కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రుల నిర్లక్ష్యంపై CM ఆగ్రహం

AP: ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై CM చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. కాకినాడ GGHలో గడిమొగకు చెందిన 8నెలల గర్భిణి మల్లేశ్వరి ప్రాణాలు కోల్పోవడం, రాజమండ్రి ఆసుపత్రిలో 55ఏళ్ల రోగికి ఎక్స్పైరైన మందులివ్వడంతో ఆ రోగి మరింత అనారోగ్యం పాలయ్యారు. ఈ ఘటనలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
News November 22, 2025
జనగామ: రేపు సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు

జనగామ జిల్లాలో ఆదివారం సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించిన మహిళా రిజర్వేషన్ల ప్రక్రియను లాటరీ పద్ధతి ద్వారా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఉదయం 9.30 గంటలకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆర్డీఓ ఆఫీసులో జీఓ 46 ప్రకారం సర్పంచ్ స్థానాలకు మహిళా రిజర్వేషన్లు, అన్ని ఎంపీడీఓ ఆఫీసుల్లో వార్డు సభ్యుల స్థానాలకు మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ జరుగుతుందని వివరించారు.
News November 22, 2025
గుర్తులేదు.. మరిచిపోయా: ఐబొమ్మ రవి

TG: మూడో రోజు పోలీసుల విచారణలో ఐబొమ్మ రవి సమాధానాలు దాట వేసినట్లు తెలుస్తోంది. అడిగిన ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెప్పాడట. బ్యాంకు ఖాతాల వివరాలపైనా నోరు విప్పలేదని సమాచారం. యూజర్ ఐడీ, పాస్వర్డ్లు అడిగితే గుర్తులేదని, మరిచిపోయానని తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో ఎథికల్ హ్యాకర్ల సాయంతో హార్డ్డిస్క్లు, పెన్డ్రైవ్లు ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


