News February 11, 2025
తగ్గుతున్న నాగార్జునసాగర్ నీటిమట్టం

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. సోమవారం సాయంత్రానికి స్పిల్ వే(546 అడుగులు) దిగువకు 543.80 అడుగులకు పడిపోయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 593 అడుగులు కాగా.. ప్రస్తుత 543 అడుగులకు చేరింది. మరోవైపు ఎడమ కాలువకు ఆన్ ఆఫ్ విధానంలో నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ రైతుల డిమాండ్ మేరకు కుడి, ఎడమ కాలువలకు ఏకధాటిగా నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు.
Similar News
News December 23, 2025
రొమ్ము క్యాన్సర్కు నానో ఇంజెక్షన్

రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్న మహిళలకు IIT మద్రాసు గుడ్ న్యూస్ చెప్పింది. AUS పరిశోధకులతో కలిసి ‘కట్టింగ్ ఎడ్జ్ నానో ఇంజెక్షన్ డ్రగ్ డెలివరీ ప్లాట్ఫామ్’ను డెవలప్ చేసింది. ఈ నానో ఇంజెక్షన్తో యాంటీ క్యాన్సర్ డ్రగ్ ‘డోక్సోరుబిసిన్’ను నేరుగా క్యాన్సర్ కణాల్లోకి ఇంజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కీమోథెరపీ, రేడియేషన్ పద్ధతుల వల్ల క్యాన్సర్ కణాలతో సంబంధంలేని ఇతర భాగాలపై ప్రభావం పడుతోంది.
News December 23, 2025
వింటర్లో గర్భిణులకు ఈ జాగ్రత్తలు

శీతాకాలంలో ఇమ్యునిటీ తక్కువగా ఉండటం వల్ల గర్భిణులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. ఇలా కాకుండా ఉండాలంటే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. చాలా చల్లగా ఉండే ఆహార పదార్థాలను తినడం మానుకోండి. తేలికపాటి వ్యాయామాలు చెయ్యాలి. ఎప్పటికప్పుడు ప్రినేటల్ చెకప్లు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News December 23, 2025
బాపట్లకు భారీ పరిశ్రమ

సౌర విద్యుత్ ఉత్పత్తి భారీ పరిశ్రమ ఏర్పాటుకు బల్లికురవ, సంతమాగులూరు మండలాలలో 1,591.17 ఎకరాల భూమికి సహకరించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సోమవారం అన్నారు. ఈ పరిశ్రమకు కేటాయించే భూసేకరణకు నిధులు విడుదలయ్యాయన్నారు. వేగంగా భూసేకరణ చేపట్టి, ల్యాండ్ బ్యాంకు సిద్ధం చేయాలన్నారు. 2 వారాలలో సమగ్ర నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూమి ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.


