News February 11, 2025
తగ్గుతున్న నాగార్జునసాగర్ నీటిమట్టం

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు వేగంగా తగ్గిపోతున్నాయి. సోమవారం సాయంత్రానికి స్పిల్ వే(546 అడుగులు) దిగువకు 543.80 అడుగులకు పడిపోయింది. పూర్తిస్థాయి నీటిమట్టం 593 అడుగులు కాగా.. ప్రస్తుత 543 అడుగులకు చేరింది. మరోవైపు ఎడమ కాలువకు ఆన్ ఆఫ్ విధానంలో నీటిని విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. కానీ రైతుల డిమాండ్ మేరకు కుడి, ఎడమ కాలువలకు ఏకధాటిగా నీటిని విడుదల చేస్తూనే ఉన్నారు.
Similar News
News December 3, 2025
పాడి రైతులు ఈ విషయం గుర్తుంచుకోవాలి

రోజుకు రెండు లీటర్లు పాలిచ్చే 5 ఆవులను పోషించే బదులు.. రోజుకు 10 లీటర్లు పాలిచ్చే ఒక సంకరజాతి ఆవును పోషించడం ఎంతో లాభసాటిగా ఉంటుందని వెటర్నరీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పాడి పశువుల పోషణ వ్యయంలో 60 నుంచి 70 శాతం వ్యయం దాణా, గడ్డి, మందులకే ఖర్చవుతుంది. పాడి పరిశ్రమను లాభసాటిగా సాగించాలంటే పాడి పశువుల మేపుపై అదుపు, సంకరజాతి పశువుల పోషణపై సరైన అవగాహన కలిగి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
News December 3, 2025
CM చంద్రబాబు నల్లజర్ల షెడ్యూల్ ఇదే.!

సీఎం చంద్రబాబు బుధవారం ఉదయం 11:20కి నల్లజర్ల చేరుకుంటారని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. 11:20–11:40 AM రైతన్నా–మీ కోసం స్టాళ్ల పరిశీలన, 11:45AM వేదిక వద్దకు చేరుకుంటారు. కలెక్టర్ స్వాగత ప్రసంగం. 11:50 AM–12:15 PM రైతులతో సీఎం పరస్పర చర్చ ఉంటుందన్నారు. 12:15–12:20 PMఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రసంగం, రైతులకు సన్మానం, 1.15 గంటలకు పార్టీ కేడర్తో సమావేశం అవుతారన్నారు.
News December 3, 2025
ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు తత్కాల్ అవకాశం: DEO

ఏపీ ఓపెన్ స్కూల్ 2025–2026 విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు తత్కాల్ పద్ధతి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈనెల 2 నుంచి 6 వరకు అవకాశం ఉందని డీఈవో నారాయణ తెలిపారు. విద్యార్థులు రూ.600 అపరాధ రుసుము చెల్లించి అడ్మిషన్ పొందవచ్చునని అన్నారు. పూర్తి వివరాలను https://apopenschollo.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలని ఆయన సూచించారు.


