News October 26, 2024

తడలో రైలు ఢీకొని వ్యక్తి మృతి

image

తడ రైల్వే స్టేషన్‌లో పట్టాలు దాటుతూ రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతుడు మాంబట్టు సెజ్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో విధులు నిర్వహిస్తున్న వరదయ్యపాలెం గ్రామానికి చెందిన ప్రభాకర్‌గా పోలీసులు గుర్తించారు. ఎక్స్ ప్రెస్ రైలు వేగంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 10, 2025

కోవూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు శిక్ష

image

కోవూరు పరిధిలో నమోదైన పోక్సో కేస్‌లో నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సీపీరెడ్డి సుమ మంగళవారం తీర్పునిచ్చారు. 2021 MAR. 21న మహిళా పోలీస్ స్టేషన్లో కోవూరు(M)నికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన రాయదుర్గం వెంకటేశ్వర్లు అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.

News December 10, 2025

నెల్లూరు: బలమైన కారణాలు కావాలా.. విలువలకు లేదా..!

image

నెల్లూరు జిల్లా అంటే లక్షలాదిమందికి ఎమోషన్. కానీ ఇది అవసరం లేదంట. బలమైన కారణం కావాలంట. కలువాయ, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతిలో కలిపే ఆలోచనలో వ్యతిరేకత మొదలైంది. ఈక్రమంలో వచ్చే అభ్యంతరాల్లో కండలేరు రిజర్వాయర్, జిల్లాకేంద్రంతో దూరం, చారిత్రక ఆధారాలు వంటి వాటితో పాటు బలమైన అంశాలు తెలియజేయాలని, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లందుకు ప్రాధాన్యం ఉంటుందనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది.

News December 10, 2025

నెల్లూరు: బలమైన కారణాలు కావాలా.. విలువలకు లేదా..!

image

నెల్లూరు జిల్లా అంటే లక్షలాదిమందికి ఎమోషన్. కానీ ఇది అవసరం లేదంట. బలమైన కారణం కావాలంట. కలువాయ, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతిలో కలిపే ఆలోచనలో వ్యతిరేకత మొదలైంది. ఈక్రమంలో వచ్చే అభ్యంతరాల్లో కండలేరు రిజర్వాయర్, జిల్లాకేంద్రంతో దూరం, చారిత్రక ఆధారాలు వంటి వాటితో పాటు బలమైన అంశాలు తెలియజేయాలని, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లందుకు ప్రాధాన్యం ఉంటుందనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది.