News April 8, 2025

తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది: సీతక్క

image

ములుగు జిల్లాలో కురిసిన వర్షానికి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి అందించాలని కలెక్టర్ దివాకర టీఎస్‌ను మంత్రి సీతక్క ఆదేశించారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. మండలాల వారీగా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధికారులతో పర్యటించి రైతులకు అండగా ఉండాలన్నారు.

Similar News

News October 25, 2025

ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు

image

TG: ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. మొదటి సంవత్సరంలో కూడా ల్యాబ్స్, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయని ఇంటర్ బోర్డ్ తెలిపింది.

News October 25, 2025

నీటి పథకాలు సమర్థవంతంగా పనిచేయాలి : కలెక్టర్

image

నీటి పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో శనివారం కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి నీటి పథకం సమర్ధవంతంగా పని చేయాలని, సి.పి.డబ్ల్యూ నీటి పథకాల మరమ్మతులకు ప్రతిపాదనలు జిల్లా పరిషత్ కు పంపించాలని సూచించారు. స్లో సాండ్ ఫిల్టర్లు ఏర్పాటుకు ప్రాధాన్యత మేరకు గుర్తించి అంచనాలు సమర్పించాలని ఆదేశించారు.

News October 25, 2025

నాగ దేవతను పూజిస్తే కలిగే ఫలితాలు

image

నాగుల చవితి రోజున నాగ దేవతను భక్తి శ్రద్ధలతో పూజిస్తే.. సర్వ రోగాలు తొలగిపోయి, సౌభాగ్యవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు. అన్ని రకాల దోషాల నుంచి విముక్తి లభిస్తుందని అంటున్నారు. సంతానం లేని దంపతులకు నాగ దేవత అనుగ్రహంతో సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఆరోగ్యకర జీవితం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. నేడు నాగ దేవతను పూజించి, నైవేద్యాలు సమర్పిస్తే అదృష్టం వెన్నంటే ఉంటుందని ప్రగాఢ విశ్వాసం.